ఉపఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కావడంతో రాష్ట్రంలో నామినేషన్ల ఘట్టానికి తెరలేసింది. హైదరాబాద్ వచ్చిన కేంద్ర ఎన్నికల కమిషనర్ బ్రహ్మ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు ఎన్నికలు జరిగే జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శుక్రవారం మంచిరోజు కావడంతో పలువురు అభ్యర్థులు అట్టహాసంగా నామినేషన్లు ఫైల్ చేశారు. మరోవైపు.. అనంత ఎన్నికల ప్రచారంలో హింస చెలరేగింది.రాష్ట్రంలోని ఒక పార్లమెంట్, 18 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల...

