Sunday, May 20, 2012
 

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రమ్ ఓం ||

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రమ్

ఓం ||

అస్య శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య, వశిన్యాది వాగ్దేవతా ఋషయః, అనుష్టుప్ ఛందః, శ్రీ లలితా పరాభట్టారికా మహా త్రిపుర సుందరీ దేవతా, ఐం బీజం, క్లీం శక్తిః, సౌః కీలకం, మమ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థే లలితా త్రిపురసుందరీ పరాభట్టారికా సహస్ర నామ జపే వినియోగః

కరన్యాసః

ఐమ్ అంగుష్టాభ్యాం నమః, క్లీం తర్జనీభ్యాం నమః, సౌః మధ్యమాభ్యాం నమః, సౌః అనామికాభ్యాం నమః, క్లీం కనిష్ఠికాభ్యాం నమః, ఐం కరతల కరపృష్ఠాభ్యాం నమః

అంగన్యాసః

ఐం హృదయాయ నమః, క్లీం శిరసే స్వాహా, సౌః శిఖాయై వషట్, సౌః కవచ్హాయ హుం, క్లీం నేత్రత్రయాయ వౌషట్, ఐమ్ అస్త్రాయఫట్, భూర్భువస్సువరోమితి దిగ్బంధః

ధ్యానం

అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపామ్ |

అణిమాదిభి రావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీమ్ || 1 ||

ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మ పత్రాయతాక్షీం

హేమాభాం పీతవస్త్రాం కరకలిత లసమద్ధేమపద్మాం వరాంగీమ్ |

సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం

శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురసుతాం సర్వసంపత్-ప్రదాత్రీమ్ || 2 ||

సకుంకుమ విలేపనా మళికచుంబి కస్తూరికాం

సమంద హసితేక్షణాం సశరచాప పాశాంకుశామ్ |

అశేష జనమోహినీ మరుణమాల్య భూషోజ్జ్వలాం

జపాకుసుమ భాసురాం జపవిధౌ స్మరే దంబికామ్ || 3 ||

సింధూరారుణ విగ్రహాం త్రిణయనాం మాణిక్య మౌళిస్ఫుర-

త్తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీన వక్షోరుహామ్ |

పాణిభ్యా మలిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం

సౌమ్యాం రత్నఘటస్థ రక్త చరణాం ధ్యాయేత్పరామంబికామ్ || 4 ||

లమిత్యాది పంచ్హపూజాం విభావయేత్

లం పృథివీ తత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై గంధం పరికల్పయామి

హమ్ ఆకాశ తత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై పుష్పం పరికల్పయామి

యం వాయు తత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై ధూపం పరికల్పయామి

రం వహ్ని తత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై దీపం పరికల్పయామి

వమ్ అమృత తత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై అమృత నైవేద్యం పరికల్పయామి

సం సర్వ తత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై తాంబూలాది సర్వోపచారాన్ పరికల్పయామి

గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |

గురుర్స్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ||

హరిః ఓం

శ్రీ మాతా, శ్రీ మహారాఙ్ఞీ, శ్రీమత్-సింహాసనేశ్వరీ |

చిదగ్ని కుండసంభూతా, దేవకార్యసముద్యతా || 1 ||

ఉద్యద్భాను సహస్రాభా, చతుర్బాహు సమన్వితా |

రాగస్వరూప పాశాఢ్యా, క్రోధాకారాంకుశోజ్జ్వలా || 2 ||

మనోరూపేక్షుకోదండా, పంచతన్మాత్ర సాయకా |

నిజారుణ ప్రభాపూర మజ్జద్-బ్రహ్మాండమండలా || 3 ||

చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా

కురువింద మణిశ్రేణీ కనత్కోటీర మండితా || 4 ||

అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభితా |

ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకా || 5 ||

వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా |

వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనా || 6 ||

నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితా |

తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా || 7 ||

కదంబ మంజరీక్లుప్త కర్ణపూర మనోహరా |

తాటంక యుగళీభూత తపనోడుప మండలా || 8 ||

పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూః |

నవవిద్రుమ బింబశ్రీః న్యక్కారి రదనచ్ఛదా || 9 ||

శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వలా |

కర్పూరవీటి కామోద సమాకర్ష ద్దిగంతరా || 10 ||

నిజసల్లాప మాధుర్య వినిర్భర్-త్సిత కచ్ఛపీ |

మందస్మిత ప్రభాపూర మజ్జత్-కామేశ మానసా || 11 ||

అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితా |

కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కంథరా || 12 ||

కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితా |

రత్నగ్రైవేయ చింతాక లోలముక్తా ఫలాన్వితా || 13 ||

కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్తనీ|

నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయీ || 14 ||

లక్ష్యరోమలతా ధారతా సమున్నేయ మధ్యమా |

స్తనభార దళన్-మధ్య పట్టబంధ వళిత్రయా || 15 ||

అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్-కటీతటీ |

రత్నకింకిణి కారమ్య రశనాదామ భూషితా || 16 ||

కామేశ ఙ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్వితా |

మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితా || 17 ||

ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభ జంఘికా |

గూఢగుల్భా కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా || 18 ||

నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణా |

పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా || 19 ||

శింజాన మణిమంజీర మండిత శ్రీ పదాంబుజా |

మరాళీ మందగమనా, మహాలావణ్య శేవధిః || 20 ||

సర్వారుణాஉనవద్యాంగీ సర్వాభరణ భూషితా |

శివకామేశ్వరాంకస్థా, శివా, స్వాధీన వల్లభా || 21 ||

సుమేరు మధ్యశృంగస్థా, శ్రీమన్నగర నాయికా |

చింతామణి గృహాంతస్థా, పంచబ్రహ్మాసనస్థితా || 22 ||

మహాపద్మాటవీ సంస్థా, కదంబ వనవాసినీ |

సుధాసాగర మధ్యస్థా, కామాక్షీ కామదాయినీ || 23 ||

దేవర్షి గణసంఘాత స్తూయమానాత్మ వైభవా |

భండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్వితా || 24 ||

సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితా |

అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటికోటి భిరావృతా || 25 ||

చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా |

గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితా || 26 ||

కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా |

జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా || 27 ||

భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితా |

నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా || 28 ||

భండపుత్ర వధోద్యుక్త బాలావిక్రమ నందితా |

మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషితా || 29 ||

విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా |

కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా || 30 ||

మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా |

భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణీ || 31 ||

కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః |

మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికా || 32 ||

కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యకా |

బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవసంస్తుత వైభవా || 33 ||

హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధిః |

శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజా || 34 ||

కంఠాధః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణీ |

శక్తికూటైక తాపన్న కట్యథోభాగ ధారిణీ || 35 ||

మూలమంత్రాత్మికా, మూలకూట త్రయ కళేబరా |

కుళామృతైక రసికా, కుళసంకేత పాలినీ || 36 ||

కుళాంగనా, కుళాంతఃస్థా, కౌళినీ, కుళయోగినీ |

అకుళా, సమయాంతఃస్థా, సమయాచార తత్పరా || 37 ||

మూలాధారైక నిలయా, బ్రహ్మగ్రంథి విభేదినీ |

మణిపూరాంత రుదితా, విష్ణుగ్రంథి విభేదినీ || 38 ||

ఆఙ్ఞా చక్రాంతరాళస్థా, రుద్రగ్రంథి విభేదినీ |

సహస్రారాంబుజా రూఢా, సుధాసారాభి వర్షిణీ || 39 ||

తటిల్లతా సమరుచిః, షట్-చక్రోపరి సంస్థితా |

మహాశక్తిః, కుండలినీ, బిసతంతు తనీయసీ || 40 ||

భవానీ, భావనాగమ్యా, భవారణ్య కుఠారికా |

భద్రప్రియా, భద్రమూర్తి, ర్భక్తసౌభాగ్య దాయినీ || 41 ||

భక్తిప్రియా, భక్తిగమ్యా, భక్తివశ్యా, భయాపహా |

శాంభవీ, శారదారాధ్యా, శర్వాణీ, శర్మదాయినీ || 42 ||

శాంకరీ, శ్రీకరీ, సాధ్వీ, శరచ్చంద్రనిభాననా |

శాతోదరీ, శాంతిమతీ, నిరాధారా, నిరంజనా || 43 ||

నిర్లేపా, నిర్మలా, నిత్యా, నిరాకారా, నిరాకులా |

నిర్గుణా, నిష్కళా, శాంతా, నిష్కామా, నిరుపప్లవా || 44 ||

నిత్యముక్తా, నిర్వికారా, నిష్ప్రపంచా, నిరాశ్రయా |

నిత్యశుద్ధా, నిత్యబుద్ధా, నిరవద్యా, నిరంతరా || 45 ||

నిష్కారణా, నిష్కళంకా, నిరుపాధి, ర్నిరీశ్వరా |

నీరాగా, రాగమథనీ, నిర్మదా, మదనాశినీ || 46 ||

నిశ్చింతా, నిరహంకారా, నిర్మోహా, మోహనాశినీ |

నిర్మమా, మమతాహంత్రీ, నిష్పాపా, పాపనాశినీ || 47 ||

నిష్క్రోధా, క్రోధశమనీ, నిర్లోభా, లోభనాశినీ |

నిఃసంశయా, సంశయఘ్నీ, నిర్భవా, భవనాశినీ || 48 ||

నిర్వికల్పా, నిరాబాధా, నిర్భేదా, భేదనాశినీ |

నిర్నాశా, మృత్యుమథనీ, నిష్క్రియా, నిష్పరిగ్రహా || 49 ||

నిస్తులా, నీలచికురా, నిరపాయా, నిరత్యయా |

దుర్లభా, దుర్గమా, దుర్గా, దుఃఖహంత్రీ, సుఖప్రదా || 50 ||

దుష్టదూరా, దురాచార శమనీ, దోషవర్జితా |

సర్వఙ్ఞా, సాంద్రకరుణా, సమానాధికవర్జితా || 51 ||

సర్వశక్తిమయీ, సర్వమంగళా, సద్గతిప్రదా |

సర్వేశ్వరీ, సర్వమయీ, సర్వమంత్ర స్వరూపిణీ || 52 ||

సర్వయంత్రాత్మికా, సర్వతంత్రరూపా, మనోన్మనీ |

మాహేశ్వరీ, మహాదేవీ, మహాలక్ష్మీ, ర్మృడప్రియా || 53 ||

మహారూపా, మహాపూజ్యా, మహాపాతక నాశినీ |

మహామాయా, మహాసత్త్వా, మహాశక్తి ర్మహారతిః || 54 ||

మహాభోగా, మహైశ్వర్యా, మహావీర్యా, మహాబలా |

మహాబుద్ధి, ర్మహాసిద్ధి, ర్మహాయోగేశ్వరేశ్వరీ || 55 ||

మహాతంత్రా, మహామంత్రా, మహాయంత్రా, మహాసనా |

మహాయాగ క్రమారాధ్యా, మహాభైరవ పూజితా || 56 ||

మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణీ |

మహాకామేశ మహిషీ, మహాత్రిపుర సుందరీ || 57 ||

చతుఃషష్ట్యుపచారాఢ్యా, చతుష్షష్టి కళామయీ |

మహా చతుష్షష్టి కోటి యోగినీ గణసేవితా || 58 ||

మనువిద్యా, చంద్రవిద్యా, చంద్రమండలమధ్యగా |

చారురూపా, చారుహాసా, చారుచంద్ర కళాధరా || 59 ||

చరాచర జగన్నాథా, చక్రరాజ నికేతనా |

పార్వతీ, పద్మనయనా, పద్మరాగ సమప్రభా || 60 ||

పంచప్రేతాసనాసీనా, పంచబ్రహ్మ స్వరూపిణీ |

చిన్మయీ, పరమానందా, విఙ్ఞాన ఘనరూపిణీ || 61 ||

ధ్యానధ్యాతృ ధ్యేయరూపా, ధర్మాధర్మ వివర్జితా |

విశ్వరూపా, జాగరిణీ, స్వపంతీ, తైజసాత్మికా || 62 ||

సుప్తా, ప్రాఙ్ఞాత్మికా, తుర్యా, సర్వావస్థా వివర్జితా |

సృష్టికర్త్రీ, బ్రహ్మరూపా, గోప్త్రీ, గోవిందరూపిణీ || 63 ||

సంహారిణీ, రుద్రరూపా, తిరోధానకరీశ్వరీ |

సదాశివానుగ్రహదా, పంచకృత్య పరాయణా || 64 ||

భానుమండల మధ్యస్థా, భైరవీ, భగమాలినీ |

పద్మాసనా, భగవతీ, పద్మనాభ సహోదరీ || 65 ||

ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిః |

సహస్రశీర్షవదనా, సహస్రాక్షీ, సహస్రపాత్ || 66 ||

ఆబ్రహ్మ కీటజననీ, వర్ణాశ్రమ విధాయినీ |

నిజాఙ్ఞారూపనిగమా, పుణ్యాపుణ్య ఫలప్రదా || 67 ||

శ్రుతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళికా |

సకలాగమ సందోహ శుక్తిసంపుట మౌక్తికా || 68 ||

పురుషార్థప్రదా, పూర్ణా, భోగినీ, భువనేశ్వరీ |

అంబికా,உనాది నిధనా, హరిబ్రహ్మేంద్ర సేవితా || 69 ||

నారాయణీ, నాదరూపా, నామరూప వివర్జితా |

హ్రీంకారీ, హ్రీమతీ, హృద్యా, హేయోపాదేయ వర్జితా || 70 ||

రాజరాజార్చితా, రాఙ్ఞీ, రమ్యా, రాజీవలోచనా |

రంజనీ, రమణీ, రస్యా, రణత్కింకిణి మేఖలా || 71 ||

రమా, రాకేందువదనా, రతిరూపా, రతిప్రియా |

రక్షాకరీ, రాక్షసఘ్నీ, రామా, రమణలంపటా || 72 ||

కామ్యా, కామకళారూపా, కదంబ కుసుమప్రియా |

కల్యాణీ, జగతీకందా, కరుణారస సాగరా || 73 ||

కళావతీ, కళాలాపా, కాంతా, కాదంబరీప్రియా |

వరదా, వామనయనా, వారుణీమదవిహ్వలా || 74 ||

విశ్వాధికా, వేదవేద్యా, వింధ్యాచల నివాసినీ |

విధాత్రీ, వేదజననీ, విష్ణుమాయా, విలాసినీ || 75 ||

క్షేత్రస్వరూపా, క్షేత్రేశీ, క్షేత్ర క్షేత్రఙ్ఞ పాలినీ |

క్షయవృద్ధి వినిర్ముక్తా, క్షేత్రపాల సమర్చితా || 76 ||

విజయా, విమలా, వంద్యా, వందారు జనవత్సలా |

వాగ్వాదినీ, వామకేశీ, వహ్నిమండల వాసినీ || 77 ||

భక్తిమత్-కల్పలతికా, పశుపాశ విమోచనీ |

సంహృతాశేష పాషండా, సదాచార ప్రవర్తికా || 78 ||

తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా |

తరుణీ, తాపసారాధ్యా, తనుమధ్యా, తమోஉపహా || 79 ||

చితి, స్తత్పదలక్ష్యార్థా, చిదేక రసరూపిణీ |

స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః || 80 ||

పరా, ప్రత్యక్చితీ రూపా, పశ్యంతీ, పరదేవతా |

మధ్యమా, వైఖరీరూపా, భక్తమానస హంసికా || 81 ||

కామేశ్వర ప్రాణనాడీ, కృతఙ్ఞా, కామపూజితా |

శృంగార రససంపూర్ణా, జయా, జాలంధరస్థితా || 82 ||

ఓడ్యాణ పీఠనిలయా, బిందుమండల వాసినీ |

రహోయాగ క్రమారాధ్యా, రహస్తర్పణ తర్పితా || 83 ||

సద్యః ప్రసాదినీ, విశ్వసాక్షిణీ, సాక్షివర్జితా |

షడంగదేవతా యుక్తా, షాడ్గుణ్య పరిపూరితా || 84 ||

నిత్యక్లిన్నా, నిరుపమా, నిర్వాణ సుఖదాయినీ |

నిత్యా, షోడశికారూపా, శ్రీకంఠార్ధ శరీరిణీ || 85 ||

ప్రభావతీ, ప్రభారూపా, ప్రసిద్ధా, పరమేశ్వరీ |

మూలప్రకృతి రవ్యక్తా, వ్యక్తాஉవ్యక్త స్వరూపిణీ || 86 ||

వ్యాపినీ, వివిధాకారా, విద్యాஉవిద్యా స్వరూపిణీ |

మహాకామేశ నయనా, కుముదాహ్లాద కౌముదీ || 87 ||

భక్తహార్ద తమోభేద భానుమద్-భానుసంతతిః |

శివదూతీ, శివారాధ్యా, శివమూర్తి, శ్శివంకరీ || 88 ||

శివప్రియా, శివపరా, శిష్టేష్టా, శిష్టపూజితా |

అప్రమేయా, స్వప్రకాశా, మనోవాచామ గోచరా || 89 ||

చిచ్ఛక్తి, శ్చేతనారూపా, జడశక్తి, ర్జడాత్మికా |

గాయత్రీ, వ్యాహృతి, స్సంధ్యా, ద్విజబృంద నిషేవితా || 90 ||

తత్త్వాసనా, తత్త్వమయీ, పంచకోశాంతరస్థితా |

నిస్సీమమహిమా, నిత్యయౌవనా, మదశాలినీ || 91 ||

మదఘూర్ణిత రక్తాక్షీ, మదపాటల గండభూః |

చందన ద్రవదిగ్ధాంగీ, చాంపేయ కుసుమ ప్రియా || 92 ||

కుశలా, కోమలాకారా, కురుకుళ్ళా, కులేశ్వరీ |

కుళకుండాలయా, కౌళ మార్గతత్పర సేవితా || 93 ||

కుమార గణనాథాంబా, తుష్టిః, పుష్టి, ర్మతి, ర్ధృతిః |

శాంతిః, స్వస్తిమతీ, కాంతి, ర్నందినీ, విఘ్ననాశినీ || 94 ||

తేజోవతీ, త్రినయనా, లోలాక్షీ కామరూపిణీ |

మాలినీ, హంసినీ, మాతా, మలయాచల వాసినీ || 95 ||

సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా |

కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ || 96 ||

వజ్రేశ్వరీ, వామదేవీ, వయోஉవస్థా వివర్జితా |

సిద్ధేశ్వరీ, సిద్ధవిద్యా, సిద్ధమాతా, యశస్వినీ || 97 ||

విశుద్ధి చక్రనిలయా,உஉరక్తవర్ణా, త్రిలోచనా |

ఖట్వాంగాది ప్రహరణా, వదనైక సమన్వితా || 98 ||

పాయసాన్నప్రియా, త్వక్స్థా, పశులోక భయంకరీ |

అమృతాది మహాశక్తి సంవృతా, డాకినీశ్వరీ || 99 ||

అనాహతాబ్జ నిలయా, శ్యామాభా, వదనద్వయా |

దంష్ట్రోజ్జ్వలా,உక్షమాలాధిధరా, రుధిర సంస్థితా || 100 ||

కాళరాత్ర్యాది శక్త్యోఘవృతా, స్నిగ్ధౌదనప్రియా |

మహావీరేంద్ర వరదా, రాకిణ్యంబా స్వరూపిణీ || 101 ||

మణిపూరాబ్జ నిలయా, వదనత్రయ సంయుతా |

వజ్రాధికాయుధోపేతా, డామర్యాదిభి రావృతా || 102 ||

రక్తవర్ణా, మాంసనిష్ఠా, గుడాన్న ప్రీతమానసా |

సమస్త భక్తసుఖదా, లాకిన్యంబా స్వరూపిణీ || 103 ||

స్వాధిష్ఠానాంబు జగతా, చతుర్వక్త్ర మనోహరా |

శూలాద్యాయుధ సంపన్నా, పీతవర్ణా,உతిగర్వితా || 104 ||

మేదోనిష్ఠా, మధుప్రీతా, బందిన్యాది సమన్వితా |

దధ్యన్నాసక్త హృదయా, డాకినీ రూపధారిణీ || 105 ||

మూలా ధారాంబుజారూఢా, పంచవక్త్రా,உస్థిసంస్థితా |

అంకుశాది ప్రహరణా, వరదాది నిషేవితా || 106 ||

ముద్గౌదనాసక్త చిత్తా, సాకిన్యంబాస్వరూపిణీ |

ఆఙ్ఞా చక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా || 107 ||

మజ్జాసంస్థా, హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా |

హరిద్రాన్నైక రసికా, హాకినీ రూపధారిణీ || 108 ||

సహస్రదళ పద్మస్థా, సర్వవర్ణోప శోభితా |

సర్వాయుధధరా, శుక్ల సంస్థితా, సర్వతోముఖీ || 109 ||

సర్వౌదన ప్రీతచిత్తా, యాకిన్యంబా స్వరూపిణీ |

స్వాహా, స్వధా,உమతి, ర్మేధా, శ్రుతిః, స్మృతి, రనుత్తమా || 110 ||

పుణ్యకీర్తిః, పుణ్యలభ్యా, పుణ్యశ్రవణ కీర్తనా |

పులోమజార్చితా, బంధమోచనీ, బంధురాలకా || 111 ||

విమర్శరూపిణీ, విద్యా, వియదాది జగత్ప్రసూః |

సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ || 112 ||

అగ్రగణ్యా,உచింత్యరూపా, కలికల్మష నాశినీ |

కాత్యాయినీ, కాలహంత్రీ, కమలాక్ష నిషేవితా || 113 ||

తాంబూల పూరిత ముఖీ, దాడిమీ కుసుమప్రభా |

మృగాక్షీ, మోహినీ, ముఖ్యా, మృడానీ, మిత్రరూపిణీ || 114 ||

నిత్యతృప్తా, భక్తనిధి, ర్నియంత్రీ, నిఖిలేశ్వరీ |

మైత్ర్యాది వాసనాలభ్యా, మహాప్రళయ సాక్షిణీ || 115 ||

పరాశక్తిః, పరానిష్ఠా, ప్రఙ్ఞాన ఘనరూపిణీ |

మాధ్వీపానాలసా, మత్తా, మాతృకా వర్ణ రూపిణీ || 116 ||

మహాకైలాస నిలయా, మృణాల మృదుదోర్లతా |

మహనీయా, దయామూర్తీ, ర్మహాసామ్రాజ్యశాలినీ || 117 ||

ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా |

శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా || 118 ||

కటాక్షకింకరీ భూత కమలా కోటిసేవితా |

శిరఃస్థితా, చంద్రనిభా, ఫాలస్థేంద్ర ధనుఃప్రభా || 119 ||

హృదయస్థా, రవిప్రఖ్యా, త్రికోణాంతర దీపికా |

దాక్షాయణీ, దైత్యహంత్రీ, దక్షయఙ్ఞ వినాశినీ || 120 ||

దరాందోళిత దీర్ఘాక్షీ, దరహాసోజ్జ్వలన్ముఖీ |

గురుమూర్తి, ర్గుణనిధి, ర్గోమాతా, గుహజన్మభూః || 121 ||

దేవేశీ, దండనీతిస్థా, దహరాకాశ రూపిణీ |

ప్రతిపన్ముఖ్య రాకాంత తిథిమండల పూజితా || 122 ||

కళాత్మికా, కళానాథా, కావ్యాలాప వినోదినీ |

సచామర రమావాణీ సవ్యదక్షిణ సేవితా || 123 ||

ఆదిశక్తి, రమేయా,உஉత్మా, పరమా, పావనాకృతిః |

అనేకకోటి బ్రహ్మాండ జననీ, దివ్యవిగ్రహా || 124 ||

క్లీంకారీ, కేవలా, గుహ్యా, కైవల్య పదదాయినీ |

త్రిపురా, త్రిజగద్వంద్యా, త్రిమూర్తి, స్త్రిదశేశ్వరీ || 125 ||

త్ర్యక్షరీ, దివ్యగంధాఢ్యా, సింధూర తిలకాంచితా |

ఉమా, శైలేంద్రతనయా, గౌరీ, గంధర్వ సేవితా || 126 ||

విశ్వగర్భా, స్వర్ణగర్భా,உవరదా వాగధీశ్వరీ |

ధ్యానగమ్యా,உపరిచ్ఛేద్యా, ఙ్ఞానదా, ఙ్ఞానవిగ్రహా || 127 ||

సర్వవేదాంత సంవేద్యా, సత్యానంద స్వరూపిణీ |

లోపాముద్రార్చితా, లీలాక్లుప్త బ్రహ్మాండమండలా || 128 ||

అదృశ్యా, దృశ్యరహితా, విఙ్ఞాత్రీ, వేద్యవర్జితా |

యోగినీ, యోగదా, యోగ్యా, యోగానందా, యుగంధరా || 129 ||

ఇచ్ఛాశక్తి ఙ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీ |

సర్వధారా, సుప్రతిష్ఠా, సదసద్-రూపధారిణీ || 130 ||

అష్టమూర్తి, రజాజైత్రీ, లోకయాత్రా విధాయినీ |

ఏకాకినీ, భూమరూపా, నిర్ద్వైతా, ద్వైతవర్జితా || 131 ||

అన్నదా, వసుదా, వృద్ధా, బ్రహ్మాత్మైక్య స్వరూపిణీ |

బృహతీ, బ్రాహ్మణీ, బ్రాహ్మీ, బ్రహ్మానందా, బలిప్రియా || 132 ||

భాషారూపా, బృహత్సేనా, భావాభావ వివర్జితా |

సుఖారాధ్యా, శుభకరీ, శోభనా సులభాగతిః || 133 ||

రాజరాజేశ్వరీ, రాజ్యదాయినీ, రాజ్యవల్లభా |

రాజత్-కృపా, రాజపీఠ నివేశిత నిజాశ్రితాః || 134 ||

రాజ్యలక్ష్మీః, కోశనాథా, చతురంగ బలేశ్వరీ |

సామ్రాజ్యదాయినీ, సత్యసంధా, సాగరమేఖలా || 135 ||

దీక్షితా, దైత్యశమనీ, సర్వలోక వశంకరీ |

సర్వార్థదాత్రీ, సావిత్రీ, సచ్చిదానంద రూపిణీ || 136 ||

దేశకాలాஉపరిచ్ఛిన్నా, సర్వగా, సర్వమోహినీ |

సరస్వతీ, శాస్త్రమయీ, గుహాంబా, గుహ్యరూపిణీ || 137 ||

సర్వోపాధి వినిర్ముక్తా, సదాశివ పతివ్రతా |

సంప్రదాయేశ్వరీ, సాధ్వీ, గురుమండల రూపిణీ || 138 ||

కులోత్తీర్ణా, భగారాధ్యా, మాయా, మధుమతీ, మహీ |

గణాంబా, గుహ్యకారాధ్యా, కోమలాంగీ, గురుప్రియా || 139 ||

స్వతంత్రా, సర్వతంత్రేశీ, దక్షిణామూర్తి రూపిణీ |

సనకాది సమారాధ్యా, శివఙ్ఞాన ప్రదాయినీ || 140 ||

చిత్కళా,உనందకలికా, ప్రేమరూపా, ప్రియంకరీ |

నామపారాయణ ప్రీతా, నందివిద్యా, నటేశ్వరీ || 141 ||

మిథ్యా జగదధిష్ఠానా ముక్తిదా, ముక్తిరూపిణీ |

లాస్యప్రియా, లయకరీ, లజ్జా, రంభాది వందితా || 142 ||

భవదావ సుధావృష్టిః, పాపారణ్య దవానలా |

దౌర్భాగ్యతూల వాతూలా, జరాధ్వాంత రవిప్రభా || 143 ||

భాగ్యాబ్ధిచంద్రికా, భక్తచిత్తకేకి ఘనాఘనా |

రోగపర్వత దంభోళి, ర్మృత్యుదారు కుఠారికా || 144 ||

మహేశ్వరీ, మహాకాళీ, మహాగ్రాసా, మహాஉశనా |

అపర్ణా, చండికా, చండముండాஉసుర నిషూదినీ || 145 ||

క్షరాక్షరాత్మికా, సర్వలోకేశీ, విశ్వధారిణీ |

త్రివర్గదాత్రీ, సుభగా, త్ర్యంబకా, త్రిగుణాత్మికా || 146 ||

స్వర్గాపవర్గదా, శుద్ధా, జపాపుష్ప నిభాకృతిః |

ఓజోవతీ, ద్యుతిధరా, యఙ్ఞరూపా, ప్రియవ్రతా || 147 ||

దురారాధ్యా, దురాదర్షా, పాటలీ కుసుమప్రియా |

మహతీ, మేరునిలయా, మందార కుసుమప్రియా || 148 ||

వీరారాధ్యా, విరాడ్రూపా, విరజా, విశ్వతోముఖీ |

ప్రత్యగ్రూపా, పరాకాశా, ప్రాణదా, ప్రాణరూపిణీ || 149 ||

మార్తాండ భైరవారాధ్యా, మంత్రిణీ న్యస్తరాజ్యధూః |

త్రిపురేశీ, జయత్సేనా, నిస్త్రైగుణ్యా, పరాపరా || 150 ||

సత్యఙ్ఞానాஉనందరూపా, సామరస్య పరాయణా |

కపర్దినీ, కలామాలా, కామధుక్,కామరూపిణీ || 151 ||

కళానిధిః, కావ్యకళా, రసఙ్ఞా, రసశేవధిః |

పుష్టా, పురాతనా, పూజ్యా, పుష్కరా, పుష్కరేక్షణా || 152 ||

పరంజ్యోతిః, పరంధామ, పరమాణుః, పరాత్పరా |

పాశహస్తా, పాశహంత్రీ, పరమంత్ర విభేదినీ || 153 ||

మూర్తా,உమూర్తా,உనిత్యతృప్తా, ముని మానస హంసికా |

సత్యవ్రతా, సత్యరూపా, సర్వాంతర్యామినీ, సతీ || 154 ||

బ్రహ్మాణీ, బ్రహ్మజననీ, బహురూపా, బుధార్చితా |

ప్రసవిత్రీ, ప్రచండాஉఙ్ఞా, ప్రతిష్ఠా, ప్రకటాకృతిః || 155 ||

ప్రాణేశ్వరీ, ప్రాణదాత్రీ, పంచాశత్-పీఠరూపిణీ |

విశృంఖలా, వివిక్తస్థా, వీరమాతా, వియత్ప్రసూః || 156 ||

ముకుందా, ముక్తి నిలయా, మూలవిగ్రహ రూపిణీ |

భావఙ్ఞా, భవరోగఘ్నీ భవచక్ర ప్రవర్తినీ || 157 ||

ఛందస్సారా, శాస్త్రసారా, మంత్రసారా, తలోదరీ |

ఉదారకీర్తి, రుద్దామవైభవా, వర్ణరూపిణీ || 158 ||

జన్మమృత్యు జరాతప్త జన విశ్రాంతి దాయినీ |

సర్వోపనిష దుద్ఘుష్టా, శాంత్యతీత కళాత్మికా || 159 ||

గంభీరా, గగనాంతఃస్థా, గర్వితా, గానలోలుపా |

కల్పనారహితా, కాష్ఠా, కాంతా, కాంతార్ధ విగ్రహా || 160 ||

కార్యకారణ నిర్ముక్తా, కామకేళి తరంగితా |

కనత్-కనకతాటంకా, లీలావిగ్రహ ధారిణీ || 161 ||

అజాక్షయ వినిర్ముక్తా, ముగ్ధా క్షిప్రప్రసాదినీ |

అంతర్ముఖ సమారాధ్యా, బహిర్ముఖ సుదుర్లభా || 162 ||

త్రయీ, త్రివర్గ నిలయా, త్రిస్థా, త్రిపురమాలినీ |

నిరామయా, నిరాలంబా, స్వాత్మారామా, సుధాసృతిః || 163 ||

సంసారపంక నిర్మగ్న సముద్ధరణ పండితా |

యఙ్ఞప్రియా, యఙ్ఞకర్త్రీ, యజమాన స్వరూపిణీ || 164 ||

ధర్మాధారా, ధనాధ్యక్షా, ధనధాన్య వివర్ధినీ |

విప్రప్రియా, విప్రరూపా, విశ్వభ్రమణ కారిణీ || 165 ||

విశ్వగ్రాసా, విద్రుమాభా, వైష్ణవీ, విష్ణురూపిణీ |

అయోని, ర్యోనినిలయా, కూటస్థా, కులరూపిణీ || 166 ||

వీరగోష్ఠీప్రియా, వీరా, నైష్కర్మ్యా, నాదరూపిణీ |

విఙ్ఞాన కలనా, కల్యా విదగ్ధా, బైందవాసనా || 167 ||

తత్త్వాధికా, తత్త్వమయీ, తత్త్వమర్థ స్వరూపిణీ |

సామగానప్రియా, సౌమ్యా, సదాశివ కుటుంబినీ || 168 ||

సవ్యాపసవ్య మార్గస్థా, సర్వాపద్వి నివారిణీ |

స్వస్థా, స్వభావమధురా, ధీరా, ధీర సమర్చితా || 169 ||

చైతన్యార్ఘ్య సమారాధ్యా, చైతన్య కుసుమప్రియా |

సదోదితా, సదాతుష్టా, తరుణాదిత్య పాటలా || 170 ||

దక్షిణా, దక్షిణారాధ్యా, దరస్మేర ముఖాంబుజా |

కౌళినీ కేవలా,உనర్ఘ్యా కైవల్య పదదాయినీ || 171 ||

స్తోత్రప్రియా, స్తుతిమతీ, శ్రుతిసంస్తుత వైభవా |

మనస్వినీ, మానవతీ, మహేశీ, మంగళాకృతిః || 172 ||

విశ్వమాతా, జగద్ధాత్రీ, విశాలాక్షీ, విరాగిణీ|

ప్రగల్భా, పరమోదారా, పరామోదా, మనోమయీ || 173 ||

వ్యోమకేశీ, విమానస్థా, వజ్రిణీ, వామకేశ్వరీ |

పంచయఙ్ఞప్రియా, పంచప్రేత మంచాధిశాయినీ || 174 ||

పంచమీ, పంచభూతేశీ, పంచ సంఖ్యోపచారిణీ |

శాశ్వతీ, శాశ్వతైశ్వర్యా, శర్మదా, శంభుమోహినీ || 175 ||

ధరా, ధరసుతా, ధన్యా, ధర్మిణీ, ధర్మవర్ధినీ |

లోకాతీతా, గుణాతీతా, సర్వాతీతా, శమాత్మికా || 176 ||

బంధూక కుసుమ ప్రఖ్యా, బాలా, లీలావినోదినీ |

సుమంగళీ, సుఖకరీ, సువేషాడ్యా, సువాసినీ || 177 ||

సువాసిన్యర్చనప్రీతా, శోభనా, శుద్ధ మానసా |

బిందు తర్పణ సంతుష్టా, పూర్వజా, త్రిపురాంబికా || 178 ||

దశముద్రా సమారాధ్యా, త్రిపురా శ్రీవశంకరీ |

ఙ్ఞానముద్రా, ఙ్ఞానగమ్యా, ఙ్ఞానఙ్ఞేయ స్వరూపిణీ || 179 ||

యోనిముద్రా, త్రిఖండేశీ, త్రిగుణాంబా, త్రికోణగా |

అనఘాద్భుత చారిత్రా, వాంఛితార్థ ప్రదాయినీ || 180 ||

అభ్యాసాతి శయఙ్ఞాతా, షడధ్వాతీత రూపిణీ |

అవ్యాజ కరుణామూర్తి, రఙ్ఞానధ్వాంత దీపికా || 181 ||

ఆబాలగోప విదితా, సర్వానుల్లంఘ్య శాసనా |

శ్రీ చక్రరాజనిలయా, శ్రీమత్త్రిపుర సుందరీ || 182 ||

శ్రీ శివా, శివశక్త్యైక్య రూపిణీ, లలితాంబికా |

ఏవం శ్రీలలితాదేవ్యా నామ్నాం సాహస్రకం జగుః || 183 ||

|| ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే, ఉత్తరఖండే, శ్రీ హయగ్రీవాగస్త్య సంవాదే, శ్రీలలితారహస్యనామ శ్రీ లలితా రహస్యనామ సాహస్రస్తోత్ర కథనం నామ ద్వితీయోஉధ్యాయః ||

సింధూరారుణ విగ్రహాం త్రిణయనాం మాణిక్య మౌళిస్ఫుర-

త్తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీన వక్షోరుహామ్ |

పాణిభ్యా మలిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం

సౌమ్యాం రత్నఘటస్థ రక్త చరణాం ధ్యాయేత్పరామంబికామ్ ||

రచన: వాగ్దేవీ

 

ఆంజనేయస్వామి ధైర్యానికి ప్రతీక. శక్తిసామర్ధ్యాలకు ప్రతిరూపం.

మన పండుగల్లో హనుమాన్ జయంతి ముఖ్యమైంది. హనుమజ్జయంతి సందర్భంగా భక్తులు హనుమాన్ చాలీసా పఠిస్తారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ఆరతులు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఎక్కడ చూసినా హనుమంతుని కధలు, గీతాలతో దివ్య వాతావరణం నెలకొంటుంది. పూజలు, ఉత్సవాల అనంతరం భక్తులకు ప్రసాదాలు పంచుతారు. అనేక దేవాలయాల్లో ఈ పర్వదినం సందర్భంగా అన్నదానాలు నిర్వహిస్తారు.

ఆంజనేయస్వామి ధైర్యానికి ప్రతీక. శక్తిసామర్ధ్యాలకు ప్రతిరూపం. సముద్రం దాటి లంక చేరాడు. ఆకాశమార్గంలో పయనించి సీతమ్మవారి జాడ కనిపెట్టాడు. సంజీవనీ పర్వతాన్నే పెకిలించి తీసుకొచ్చిన వీర హనుమాన్ శక్తియుక్తులను కీర్తించడం సాధ్యమా?! హనుమజ్జయంతి సందర్భంగా పంచముఖ హనుమాన్, పాదరస హనుమాన్ తదితర విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేస్తారు. దేవాలయాల్లో హనుమాన్ ప్రత్యేక పూజలు జరుపుతారు. కొందరు ఈవేళ ఉపవాసం ఉండడానికే ఇష్టపడతారు.

హనుమజ్జయంతి ఏడాదిలో మూడుసార్లు వస్తుంది. ఎలా అంటే, ఒక్కో ప్రాంతవాసులు ఒక్కోసారి జరుపుకుంటారు. కొందరు చైత్ర పౌర్ణమినాడు హనుమాన్ జయంతి చేయగా, మరికొందరు వైశాఖమాసం దశమినాడు హనుమజ్జయంతి జరుపుతారు. ఇక తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మార్గశిర మాసంలో హనుమజ్జయంతి జరుపుకుంటారు.

హనుమజ్జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తికి, బల సంపన్నతకు సంకేతమైన హనుమంతుని విశేషాలు స్మరించుకుందాం. హనుమంతుడు అంతులేని పరాక్రమశాలి అయ్యుండీ రాముడి సేవలో గడపడానికే ప్రాధాన్యత ఇచ్చాడు. ఆంజనేయునికి శ్రీరాముడంటే ఎంత భక్తిప్రపత్తులు అంటే, తన మనసునే మందిరంగా చేసి ఆరాధించాడు. హనుమంతుడు గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనం ఇచ్చారు. శ్రీరాముని, సీతమ్మతల్లి కంటే మిన్నగా ప్రేమించాడు హనుమంతుడు.

ఒకసారి హనుమాన్ సీతాదేవి నుదుట సిందూరం పెట్టుకోవడం చూసి,”నుదుట సిందూరం ఎందుకు పెట్టుకున్నావమ్మా” అని అడుగుతాడు.

సీతమ్మ తల్లి నవ్వుతూ “శ్రీరాముడు దీర్ఘాయుష్కుడిగా ఉండాలని” అంటుంది.

అంతే, హనుమంతుడు క్షణం ఆలోచించకుండా తన ఒళ్ళంతా సిందూరం పూసుకుంటాడు. అదీ హనుమంతునికి రాముడి మీద గల నిరుపమానమైన భక్తి. హనుమంతుని భక్తికి ఇలాంటి తార్కాణాలు ఎన్నో!

ఒక సందర్భంలో సీతమ్మ హనుమంతునికి రత్నాభరణాన్ని బహూకరించింది. హనుమంతుడు ఒక్కో పూసనూ కొరికి చూసి, విసిరేయసాగాడు.

అదేమిటని అడగ్గా, ”రామయ్య తండ్రి కనిపిస్తాడేమోనని ఆశగా చూశాను. నా స్వామి లేని రత్నాలు, స్వర్ణాలతో నాకేం పని?” అన్నాడు.

హనుమంతుని నిరుపమానమైన భక్తికి ఇంతకంటే కొలమానం ఇంకేం కావాలి? రావణాసురుడు సీతమ్మను అపహరించుకుపోగా, ఆ తల్లిని అన్వేషించడానికి బయల్దేరాడు హనుమంతుడు. అహర్నిశలూ ప్రయత్నించి, సీతమ్మ జాడ తెలుసుకున్నాడు.

అశోకవనంలో శోకమూర్తిలా కూర్చుని, దిగులు సముద్రంలో కుంగిపోతూ, ఆత్మత్యాగం చేయాలనుకుంటున్న సీతమ్మకు శ్రీరాముని అంగుళీయకం చూపి, ధైర్యంగా ఉండమని స్థైర్య వచనాలు పలికాడు. లంకాదహనం చేసి తన వంతు సహకారం అందించాడు.

వాయుపుత్రుడైన హనుమంతుడు గాల్లో పయనించగలడు. పర్వతాన్ని ఎత్తి, చేత్తో పట్టుకోగలడు. భూత ప్రేత పిశాచాల్లాంటి క్షుద్రశక్తులను తరిమికొట్టగలడు. శ్రీరాముని నమ్మినబంటు అయిన హనుమంతుడు బలానికి, ధైర్యానికి ప్రతిరూపం. హనుమంతుని ఆరాధించడంవల్ల ధైర్యం,స్థైర్యం కలుగుతాయి. భయాలూ భ్రమలూ పోతాయి. చింతలు, చిరాకులు తీరతాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరి, కీర్తిప్రతిష్టలు వస్తాయి. నిత్యం హనుమంతుని నామస్మరణ చేసేవారికి ఎలాంటి ఆందోళనా దరిచేరదు. సదా ఆనందంగా ఉంటారు.

ఇక హనుమజ్జయంతి విశేష దినాన మరింత భక్తిశ్రద్దలతో హనుమంతుని అర్చిస్తారు.

Source: Teluguone.com

 

శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం!

 

 

 

హిందూ ధర్మంపై ప్రపంచీకరణ దాడి…!

‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఓపెన్ డిబెట్‌లో వక్తలు

క్షేత్రస్థాయికి ధర్మ ప్రచారం
హిందూ ధర్మ రక్షణకు ఇదే తక్షణ కర్తవ్యం
ధర్మ ప్రచారానికి స్వస్తి పలికిన మఠాధిపతులు

వ్యాపారమయమైన అర్చకత్వం, పౌరోహిత్యం
అన్ని కులాలను, సామాన్యులను అత్కున చేర్చుకోవాలి

పండితులను తయారు చేసుకుందాం: అరవిందరావు
ఆత్మ శోధన అవసరం: స్వరూపానందేంద్ర
మధ్యలోనే బయటకు వెళ్లిపోయిన పరిపూర్ణానందస్వామి

  “పూర్వం గురువు పాదాలను నమ్ముకునేవారు. ఇప్పుడు లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారు. గతంలో ఊరూరా తిరిగి ధర్మ ప్రచారం చేసేవారు. ఇప్పుడు సోకులు, స్టేటస్‌లు పెరిగి కార్లలో తిరుగుతున్నారు. ధర్మ ప్రచారానికి స్వస్తి పలికారు. అర్చకత్వం, పౌరోహిత్యం ఇప్పుడు వ్యాపారమయ్యాయి. పూజలు, శాంతుల పేరిట వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. దేశంలో ఎక్కడా హిందూ మత ప్రచారం జరగడం లేదు. కానీ, టీవీ చానళ్లు లేని చోటకు కూడా అన్యమత ప్రచారం విస్తరించింది. పీఠాధిపతులు, మఠాధిపతులు క్షేత్రస్థాయిలో తిరగాలి.

సామాన్యుల భుజంపై చేయి వేసి వారిని అక్కున చేర్చుకోవాలి. మన ధర్మాన్ని ప్రచారం చేయాలి” అని వక్తలు పిలుపునిచ్చారు. ‘హైందవంలో అంతర్మథనం’పై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సోమవారం ఓపెన్ డిబేట్ నిర్వహించింది. సంస్థ ఎండీ వేమూరి రాధాకృష్ణ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో హిందూ ధర్మాన్ని రక్షించుకునేందుకు అన్ని చర్యలు తీసుకుందామని, దూరమైపోతున్న వర్గాలను అక్కున చేర్చుకుందామని పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు, సన్యాసులు, అర్చకులంతా పిలుపునిచ్చారు.

పిల్లవాడు ఏడిస్తే పాలపొడి ఇచ్చి.. దుస్తులు ఇచ్చి మనవాళ్లను పాశ్చాత్యులు తమ మతంలోకి మార్చుకున్నారని కొండయ్య వ్యాఖ్యానించినప్పుడు శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానందస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తన స్థానం నుంచి లేచి వెళ్లి ఆయన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. తన వాదన వినకుండా కొండయ్య ప్రసంగాన్ని కొనసాగిస్తుండడంతో ఓపెన్ డిబేట్ నుంచి ఆయన బయటకు వెళ్లిపోయారు.

“ఒక దేశంలో, ఒక కాలంలో ఏది ధర్మం అనుకుంటామో.. మరో దేశంలో, మరో కాలంలో అది ధర్మం కాకపోవచ్చు. సామాజిక మార్పును అర్థం చేసుకోకపోతే చాలా ప్రమాదం. అస్పృశ్యత అనేది మను ధర్మంలో లేదు. ఉంటే చూపించండి” అని రిటైర్డ్ డీజీపీ అరవిందరావు వ్యాఖ్యానించారు. జాతి, కులం అనే మాటలు హిందూ ధర్మంలో లేవని, కేవలం గుణాలనే వర్ణాలుగా చెప్పారని పేర్కొన్నారు. “పాశ్చాత్య దేశాల మతాలు ఎక్కువైతే దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లుతుంది.

ప్రపంచీకరణలో భాగంగా, ఒక దేశ సంస్కృతిపై మరో దేశ సంస్కృతి దాడి చేస్తోంది. మన స్వామీజీలు, మఠాధిపతులు ఆశ్రమాల్లో కూర్చుని అమాయకంగా వేదాలు, పురాణాలను వల్లె వేసుకుంటున్నారు తప్పితే.. సమాజంలో ఏం జరుగుతోందనే విషయాన్ని పరిశీలించడం లేదు. పాశ్చాత్యుల దుష్ప్రచారాన్ని అడ్డుకోవడం లేదు. మన గ్రంథాలకు వాళ్లు రాస్తున్న వక్ర భాష్యాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారా? పాశ్చాత్య సిద్ధాంతాలను, మత గ్రంథాలను చదివి ఖండించకపోయినా.. కనీసం మన గ్రంథాలను మనం చదువుకుందాం.

పండితులను తయారు చేయాల్సిందిగా 15 ఏళ్లుగా ప్రతి స్వామీజీని కాళ్లు పట్టుకుని మరీ అడుగుతున్నాను. ధర్మంలో ఏముందో చెప్పే పండితులను తయారు చేసుకోవడం మనందరి కర్తవ్యం. ఇప్పటికైనా పరస్పర సహకారంతో అన్ని కులాల్లోనూ పండితులను తయారు చేసుకోవాలి” అని పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడా హిందూ ధర్మ ప్రచారం జరగడం లేదని, టీవీ చానళ్లు లేని ప్రాంతాల్లోకి కూడా అన్యమత ప్రచారం చొచ్చుకుపోతోందని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆవేదన వ్యక్తం చేశారు.

“మతం మారిన వాళ్లను మళ్లీ హిందూ మతంలోకి తీసుకురాగలుగుతున్నారా!? మన ధర్మాన్ని పేదలకు, నిరక్షరాస్యులకు అర్థమయ్యే భాషలో చెప్పలేకపోతున్నారు. మతం, ధర్మం మాకు ఏరకంగా ఉపయోగపడతాయని ప్రశ్నించే వారికి జవాబు చెప్పలేకపోతున్నారు. అర్చకుల్లోనూ లోపాలున్నాయి. పూజల పేరిట, శాంతుల పేరిట వ్యాపారం జరుగుతోంది. పీఠాధిపతులు వాస్తవ ధర్మ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. మన ధర్మంలో అంతర్గత సంస్కరణలు చేసుకోకపోతే, అంతర్జాతీయ దాడులు జరుగుతాయి” అని హెచ్చరించారు.

ఆత్మ శోధన చేసుకోవాలని, ఇందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు. లౌకికత పేరిట ప్రభుత్వాలు ఆలయాలపై పెత్తనం చేస్తున్నాయని, ధర్మ ప్రచారానికి అవకాశం ఇవ్వడం లేదని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీఆర్కే ప్రసాద్ విమర్శించారు. “మూల పీఠాలకు వేల ఎకరాలుండేవి. అవి అప్పట్లో ధర్మ ప్రచారంపై దృష్టి కేంద్రీకరించేవి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మఠాల ఆస్తిపాస్తులను జప్తు చేశారు. దాంతో వాటి మనుగడకు ప్రమాదం ఏర్పడింది. ఇతర మతస్థులు దేవాలయాల్లో ప్రచారం చేయకుండా చట్టం కావా లి. మన సమాజంలో లోపాలున్నాయి. వాటిని సరి చేయాలి. దానికి కార్యాచరణ అవసరం” అని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలోని 16వేల ఆలయాల్లో బ్రాహ్మణేతరులే అర్చకులుగా ఉన్నారని, అర్చకుడు లేని కులం రాష్ట్రంలో లేదని చెప్పారు. బ్రాహ్మణేతరులకు వేద, ఉపనిషత్తులు బోధించేందుకే ఏర్పేడు ఆశ్ర మం ఉందన్నారు. కుల వ్యవస్థ గురించి ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదని, సంప్రదాయం, వృత్తి, కట్టుబాటు, కళలను బట్టే వర్గాలుగా ఏర్పడ్డామని కమలానంద భారతి చెప్పారు. కుల వ్యవస్థతో సమాజానికి నష్టమని, ఒకే దేవుడు, ఒకే మతం అంటూ మిషనరీలు క్రైస్తవ సంఘాలు పెట్టుకుంటున్నాయని, అయినా, దళితులు, గిరిజనులు, బీసీలు బస్తీల్లో దేవాలయాలను నిర్మించుకుంటున్నారని చెప్పారు.

హిందూ ధర్మం ప్రస్తుత దుస్థితికి కేవలం మఠాధిపతులు, పూజారులే కారణమని సౌందరరాజన్ తప్పుబట్టారు. వారు తమ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. “వారు ఆశ్రమాలకే పరిమితం అవుతున్నారు. సంచారం చేయడం లేదు. ధర్మాన్ని ప్రచారం చేయడం లేదు. గౌరవం లేకపోవడంతో బ్రాహ్మణులు దేశం విడిచి వెళ్లిపోతున్నారు. దాంతో ఆలయాలు మూతపడుతున్నాయి. ఇప్పటికే 24 వేల ఆలయాలను మూసివేశారు. ప్రస్తుత దుస్థితికి ఇదీ కారణమే” అని చెప్పారు.

అన్ని మతాల్లోనూ జాతులు, కులాలున్నాయని, హిందూ చైతన్యాన్ని చాప చుట్టేయాలని చూస్తున్నారని, కానీ, హైందవ ధర్మం ఎప్పటికీ నశించదని ఆర్ఎస్ఎస్ ప్రతినిధి విజయ భారతి చెప్పారు. హిందూ ధర్మం మతం, కులాలకు సంబంధించినది కాదని, ధర్మాలన్నీ సంస్కృతంలో ఉన్నాయని, దాంతో ఇది మనది కాదులే అనే భావన కలుగుతోందని శ్రీధరస్వామి వ్యాఖ్యానించారు. “పీఠాధిపతులతోపాటు పౌరోహిత్యం, అర్చకత్వంలో కొన్ని లోపాలున్నాయి. స్వామీజీలు ఎవరూ సామాన్యులకు అందుబాటులో ఉండడం లేదు. పూర్వం గురువుల పాదాలను నమ్ముకునేవారు. ఇప్పుడు లక్షలకు అమ్ముకుంటున్నారు.

భక్తులను భయపెడుతున్నారు. ధర్మ ప్రచారం ప్రశ్నార్థకంగా మారింది. ధర్మాన్ని ఆచరించడంలో నిమగ్నం కావాలి” అని పిలుపునిచ్చారు. హిందూ ధర్మంలోని రాళ్లను ఏరివేయాల్సిందేనని భారతీయం నిర్వాహకురాలు సత్యవాణి పిలుపునిచ్చారు. “వర్ణ వ్యవస్థ కులానికి సంబంధించినది కాదు. బ్రాహ్మణులంటే జ్ఞానం. క్షత్రియులంటే బలం. వైశ్యులంటే ధనం. శూద్రులంటే శ్రమ. హిందూ ధర్మానికి శూద్రులను, స్త్రీలను దూరంగా ఉంచారు. శూద్రుడు దేవాలయాలకు వెళ్లకపోయినా ఫర్వాలేదు అని వేదాలు చెబితే.. వెళ్లకూడదని వక్రీకరించారు. మహిళే వేదం. ఆమె ప్రత్యేకంగా వేదం చదవాల్సిన అవసరం లేదని వేదాలు చెబితే.. దానిని వక్రీకరించి మహిళలు వేదం చదవరాదు అని వక్రభాష్యం చెప్పారు. అంటరానితనాన్ని వేదం చెప్పలేదు. వీటిని సరిదిద్దుకోవాలి” అని సూచించారు.

సనాతన ధర్మమే హిందూ మతానికి మూలమని, హిందూ మతానికి దెబ్బ తగిలితే ధర్మం లేకుండాపోతుందని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మసన చెన్నప్ప ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాసుడు రాసిన భారతంలోనే.. ఉత్తమమైన గుణాలు అలవరచుకుంటే ఎవరైనా బ్రాహ్మణుడేనని స్పష్టంగా చెప్పారన్నారు. స్వాతంత్రానికి పూర్వం పీఠాధిపతులు, మఠాధిపతులు ధర్మాచార్యులుగా వ్యవహరించేవారని, స్వతంత్ర దేశంలో షోకులు పెరిగాక సంచార విధానాన్ని మార్చుకుని కార్లలో తిరుగుతున్నారని. హిందూ ధర్మ ప్రచారాన్ని ఆపేశారని పుష్పగిరి పీఠానికి చెందిన వేణుమాధవశర్మ తప్పుబట్టారు.

మహాభారత కాలం నుంచీ ధర్మంపై దాడి జరుగుతూనే ఉందని, కలియుగంలో సైద్ధాంతిక నాస్తిక వాదంతో దాడి మొదలైందని బీజేపీ నేత ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్ చెప్పారు. అంబేద్కర్ వంటి గొప్ప వ్యక్తి కూడా హిందూ ధర్మంలో భాగమైన బౌద్ధంలోనే చేరాడు. తప్పితే ఇతర మతాల్లోకి వెళ్లలేదని గుర్తుచేశారు. కుహనా లౌకికవాదు లు ఎప్పటికప్పుడు తెలిసీ తెలియని చరిత్రను తీసుకొస్తున్నారని, ప్రభుత్వాల లౌకిక తత్వంతోటే ఇతర మతాలకు అవకాశాలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు.

“నదీ పుష్కరాల గురించి చాటుకోవడం లేదు. కుల, గ్రామ దేవతలను పూజించాలి. వివక్షను దూరం చేయాలన్న అంశంపై స్వాములు ప్రచారం చేయాలి. విష సంస్కృతిని మార్చాలి. అసలైన ధర్మాన్ని తెలుసుకోకుండా, అక్కడేదో కొత్తది ఉందని తెలుసుకునేందుకు వెళ్లడం ప్రలోభాలతో కూడిన మతాంతరీకరణే” అని చెప్పారు. హిందూ ధర్మంపై ప్రపంచీకరణ దాడి చేస్తోందని, ఐటీ వచ్చిన తర్వాత ఇది మరీ సులువైందని కొండయ్య వ్యాఖ్యానించారు. హిందూ మతానికి సర్వం తామే అంటున్న పురోహిత వర్గం.. స్వార్థంతో ధర్మానికి దొంగ భాష్యాలు చెప్పి, మిగిలిన వారిని ధర్మానికి దూరంగా ఉంచారని విమర్శించారు.

హిందూ పీఠాధిపతులు అన్ని వర్గాల వారినీ భుజాలపై చేయి వేసి దగ్గరకు తీసుకుంటే మతాంతరీకరణను నిరోధించవచ్చని చెప్పారు. దళితుల కన్నా మేధావులు ఇతర మతాలకు మారితేనే ప్రమాదమని, ఒక్క మేధావి లక్షలాదిమందిని మార్చగలుగుతారని అనంతలక్ష్మి హెచ్చరించారు. మతం మారిన తర్వాత కూడా దళితులు తిరిగి హిందూ మతంలోకి వస్తున్నారని చెప్పారు. “మహిళలను, పిల్లలను హిందూ ధర్మానికి దూరం చేశారు. దీనిని గమనించి బౌద్ధులు వారిని దగ్గర చేసుకున్నారు. ఆ తర్వాత ఇతర మతాలూ దానినే ఆచరణలో పెట్టి విజయవంతమవుతున్నాయి. మనం మాత్రం దూరమవుతున్నాం” అని ఆందోళన వ్యక్తం చేశారు.

హిందూ ధర్మ ప్రచారం గ్రామగ్రామాన జరగాలని, ఈ బాధ్యత మనందరిపైనా ఉందని రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ పిలుపునిచ్చారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యత్నిస్తున్నాయని విమర్శించారు. దేవాలయాలకు బదులు బడులు, ఆస్పత్రులు కట్టించాలని, అవసరమైతే 104 వైద్యసేవలను పీఠాలే నిర్వహించాలని సూచించారు.

Source on Andhrajyothi ABN

 

రహస్యమైన పురాణము “మహా భాగవతము”

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః

* ఓం శ్రీ వేదవ్యాసాయ నమః

* ఓం శ్రీశుకదేవాయ నమః
* ఓం సద్గురు దత్తాత్రేయాయ నమః 
* ఓం సద్గురు శ్రీపాద శ్రీవల్లభాయ నమః 
*  ఓం శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామియే నమః
* శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి 
  వాసరాపీఠనిలయే శ్రీ ఙ్ఞానసరస్వతి నమోస్తుతేiiI
* గురుబ్రహ్మ, గురువిష్ణుః గురుదేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరంబ్రహ్మ తస్మైశ్రీ గురవే నమః
* అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం 
  తత్పదం దర్శితం యేన తస్మైశ్రీ గురవేనమః
* ఓం నమో భగవతే వాసుదేవాయ 
  ఓం నమో భగవతే వాసుదేవాయ 
  ఓం నమో భగవతే వాసుదేవాయ

భాగవతకృష్ణుని చేతి వెన్నముద్దలు

1.  భాగవతము మహారహస్యమైన పురాణము. ఇది భగవత్స్వరూపము యొక్క అనుభవమును కలుగజేయును.

2.  బుద్ధిరూపమగు మాయ తొలగగనే జీవుడు పరమానందమయుడై తన స్వరూప మహిమయందు ప్రతిష్థితుడగుచున్నాడు. 

3.  నిష్కామ కర్మ యోగము నందు నిశ్చయాత్మకబుద్ధి ఒకటియే యుండును. కాని భోగాసక్తులైన వివేకహీనుల బుద్ధులు చంచలములై, ఒకదారీ తెన్నూ లేక కోరికలవెంట నలువైపులా పరుగులు తీయుచూ అనంతములుగా నుండును.

4.  సమస్త లోకములకు ప్రభువైన శ్రీకృష్ణుని యెడల సర్వాత్మకమగు ఆత్మభావము, అనిర్వచనీయమైన అనన్య ప్రేమ, దైవభక్తిచే మనుజుడు సంసారచక్రమందు పడనేరడు.

5.  రసము, భావము, అలంకారము మున్నగు వానితో కూడియున్నప్పటికిని ఏ వాక్కు లోకమును పవిత్రమొనర్చు శ్రీకృష్ణుని కీర్తిని ఎపుడైన గానమొనర్చలేదో అది వ్యర్థమగును.

6.  పురుషోత్తముడగు శ్రీకృష్ణునకు సమస్త కర్మలను సమర్పించుటయే ప్రపంచమందలి తాపత్రయమునకు ఏకైక చికిత్స.

7.  భగవంతుని ప్రసన్నత కొఱకై  ఏ కర్మలు చేయబడుచున్నవో, వానిచే పరాభక్తి యుక్తమగు ఙ్ఞానము కలుగుచున్నది.

8.  సుందర స్త్రీలు తమ కామ విలాసములచే శ్రీకృష్ణుని మనస్సునందు ఒంకింతైనను  క్షోభను కలుగజేయజాలకుండిరి. (అసంగుడు)

9.  దైవశరణాగతమగు బుద్ధి ప్రాకృత గుణములను అంటనట్లు ప్రకృతి యందున్నను భగవానుడు దాని గుణములచే ఎన్నడును అంటనేరడు. ఇదియే భగవంతుని భగవత్తత్త్వము.

10.    అభయపదమును పొందదలచినవాడు సర్వాత్మయు, సర్వశక్తిమంతుడును శ్రీహరియునగు భగవంతుని గూర్చి శ్రవణము, సంకీర్తనము, స్మరణము గావించవలయును.

11.  ఏవిధముగనైనను ఙ్ఞానముచే గాని, భక్తిచే గాని, ధర్మనిష్ఠచే గాని జీవితమును అంత్యకాలమున భగవంతుని గూర్చిన స్మృతి తప్పక ఉండులాగున చేసికొనవలెను. ఇదియే మానవ జన్మయొక్క గొప్పలాభము.

12.  భగవన్నామములను ప్రేమతో సంకీర్తనము చేయవలెను. సమస్త శాస్త్రముల యొక్క నిర్ణయమిదియే అయియున్నది.

13.జాగ్రత్తగ ఙ్ఞానపూర్వకముగ గడుపబడిన ఒక గడియ, రెండు గడియల కాలమైనను శ్రేష్టమైనది. రాజర్షియగు ఖట్వాంగుడు రెండు గడియలలోనే అంతయు వదలి భగవంతుని అభయ పదమును పొందెను.

14.దేనిని పొంది మనస్సు పరమ ప్రశాంతిని, ఆనందమును బడయునో అదియే విష్ణుభగవానుని యొక్క ఉత్తమపదం.  

15.  విశ్వేశ్వరుడగు భగవంతుడు దృశ్యము కాదు.

16.  ద్రష్ట, సగుణము, నిర్గుణము  అంతయు వారి స్వరూపమే అయిఉన్నది.

17.  భక్తి చేతనే అంతఃకరణము యొక్క పూర్ణశుద్ధి కాగలదు.

18.  భగవంతుని లక్షణాలు:

సత్యం, పవిత్రత, దయ, క్షమ, త్యాగం, సంతోషము, సరళత్వము, శమము, దమము, తపస్సు, సమత్వము, తితీక్ష, ఉపరతి, శాస్త్రవిచారణ, ఙ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము, వీరత్వము, తేజస్సు, బలము (ధృతి), స్మృతి, స్వతంత్రత, కౌశలము, కాంతి, ధైర్యము,కోమలత్వము, నిర్భయము, వినయము, శీలము, సాహసము, ఉత్సాహము, బలము, సౌభాగ్యము, గంభీరత్వము, స్థిరత్వము, ఆస్తికత, కీర్తి, గౌరవము, నిరహంకారము అను ఏ 39 అపాకృత గుణములను, మహనీయులచే వాంఛనీయులగు శరణాగత వత్సలత్వము మున్నగు అనేక గొప్ప సుగుణములున్ను వారిసేవ యెనర్చుటకై నిరంతరము నివసించుచున్నవో, ఒక్క క్షణమైనను వారినుండి వేఱుగనుండవో, అట్టి సమస్త సుగుణములకు ఆశ్రయుడు భగవానుడు.

19. సర్వాత్మరూపుడగు భగవంతుడు వాయువువలె, సమస్త చరాచర ప్రాణులయొక్క లోపల, బయట ఏకరూపుడై యుండుచు వారి వాంఛితములను  నెరవేర్చుచున్నారు.

20.  కలియుగంలో “సత్యం” ఒకటియే మిగిలిఉన్నది.

21.  కలి దోషాలు జూదము, మద్యపానము, స్త్రీ సంగం, హింస, సువర్ణము. ఈ స్థానములందు క్రమముగ అసత్యము, మదము, ఆసక్తి, నిర్దయత్వము (వైరము), రజోగుణము అను అధర్మములు నివసించుచుండును. కావున ఆత్మశ్రేయమును కోరువాడీ ఐదు స్థానములను ఎన్నడును సేవించరాదు.

22.  ఎవరు శ్రీకృష్ణుని లీలాకథను చెప్పుచుందురో, ఆ కథామృతమును పానమొనర్చుచుందురో, ఆ రెండు సాధనల ద్వారా వారి పాదపద్మములను స్మరించుచుందురో, అట్టివారికి అంత్యకాలమందును మోహము కలుగకుండును.

23.  కలి అఙ్ఞానులందు శూరుడుగను, ధీరులగు ఙ్ఞానులందు పిరికివాడుగను ఉండును. ప్రమత్తులై ధర్మవిషయుమున అజాగ్రత్తగా నుండు వారిని వశమొనర్చుకొనుటకై, ఇతడు సదా సావధానుడై యుండును.

24.  ’అ’ కార, ’ఉ’కార, ’మ’ కారములను మూడు మాత్రలతో కూడిన ప్రణవమును (ఓం కారము) మనస్సునందు జపించవలెను. ప్రాణవాయువును వశమందుంచుకొని మనస్సును దమనం చేయవలెను. చంచలమైన మనస్సును విచారణ ద్వారా నిరోధించి, భగవంతుని మంగళమయ రూపమందు నిలుపవలెను. దేనిని పొంది మనస్సు పరమశాంతిని, ఆనందమును బడయునో అదియే విష్ణు భగవానుని యొక్క ఉత్తమపదము.

25.  అనన్యమైన ప్రేమమయమైన భక్తి యోగము కలుగనంతవఱకు, సాధకుడు నిత్యనైమితికల కర్మల నాచరించిన పిదప, ఏకాగ్రత్తతో భగవంతుని స్మరణ చేయవలెను.

26.  మనుజునకు ఏ సాధన ద్వారా భగవంతుని యెడల అనన్య భక్తి కలుగగలదో, అది తప్ప శ్రేయస్కరమగు మఱియొక మార్గము లేదు.

27.  భగవంతుడగు బ్రహ్మదేవుడు వేదములన్నింటిని మూడుసార్లు పరిశీలించి, దేనిచే సర్వాత్మయగు శ్రీకృష్ణుని యందు అనన్యప్రేమ కలుగగలదో అదియే సర్వశ్రేష్ఠమగు ధర్మమని తన బుద్ధిచే నిశ్చయించెను.

28.  సజ్జనులగు మహనీయులు ఆత్మస్వరూపుడైన భగవంతుని కథలను గూర్చిన మధురమైన అమృతమును పంచిపెట్టుచునే యున్నారు. ఎవరు తమ కర్ణపుటములతో దానిని త్రాగుదురో వారి హృదయములందు విషయములను గూర్చిన విషప్రభావము తొలగిపోవును. వారు శుద్ధులగుదురు. మఱియు వారు భగవంతుని పాదపద్మముల సాన్నిధ్యమును పొందుదురు.

29. పరమాత్మ యొక్క వాస్తవిక స్వరూపము ఏకమై, శాంతమై, అభయమై కేవలము ఙ్ఞానస్వరూపమై యున్నది. వాక్కు అచటికి వెళ్ళజాలదు. పెక్కు సాధనలచే సంపన్నములగు కర్మల యొక్క ఫలమున్ను అచటికి చేరజాలదు. స్వయంగ మాయయు ఆ పరమాత్మ యొద్దకు పోజాలదు.

30.  ఎవరు భగవంతుని అచింత్య శక్తియగు మాయ యొక్క వర్ణనమును, ఇతరులచే గావింపబడిన భగవద్వర్ణనమును విని సంతోషించునో, మఱియు శ్రద్ధతో నిత్యము శ్రవణమొనర్చునో, అట్టివారి చిత్తము మాయచే ఎన్నడును మోహితము కానేరదు.

31.  దేహాదులకు అతీతమైన అనుభవస్వరూపమగు ఆత్మకు మాయచే తప్ప దృశ్య పదార్థములతో ఏ సంబంధమున్ను ఉండనేరదు.

32.  తపస్సు భగవంతుని యొక్క దుర్లంఘ్యమైన శక్తి అయివున్నది.

33.  అన్వయ, వ్యతిరేక పద్ధతులద్వారా సర్వాతీత, సర్వ స్వరూప పరమాత్మయే సర్వదా, సర్వత్ర వెలయుచున్నారు.

34. భగవత్కథ యొక్క రుచి శ్రద్ధాళువుయొక్క హృదయమున వృద్ధి నొందునపుడు ఇతర విషయముల నుండి అతనిని విరక్తునిగ జేయును. అతడు భగవచ్చరణముల యొక్క నిరంతర చింతనచే ఆనందమయుడగును. మఱియు అతని దుఃఖములన్నియు తత్ క్షణము నశించిపోవును.35.  పూర్వపు పాపము వలన, జనులు శ్రీహరి యొక్క కథల యెడల విముఖులై ఉందురు. వారు వాక్కు చేతను, శరీరము చేతను, మనస్సు చేతను వ్యర్థ వాద వివాదములందును, వ్యర్థ చేష్టలందును, వ్యర్థ చింతన మందును నిమగ్నులై యుండుచున్నారు.  

36.  భగవంతుని యొక్క కథామృతమును పానమొనర్చుటచే పొంగిపొరలిన భక్తిచే నిర్మలమైనట్టి అంతఃకరణము గలవారు వైరాగ్యమే సారముగా గల ఆత్మఙ్ఞానమును పొంది అనాయసముగనే మీ యొక్క వైకుంఠధామము నకేగుచున్నారు.

37. సమాధి బలముచే కొందరు ప్రబలమగు మాయను జయించి పరమాత్మయందే లీనమగుచున్నారు. కాని వారికి చాలశ్రమ కలుగుచున్నది. అయితే భగవంతుని సేవా మార్గమందే మాత్రము కష్టము లేదు.

38.  కీర్తింపదగినట్టి శ్రీహరి యొక్క గుణములను గానమొనర్చుటయే మనుజుల వాక్కునకును, విద్వాంసుల ముఖతః భగవత్కథామృతమును పానమొనర్చుటయే మనుజుల చెవులకును చాల గొప్ప లాభమని మహాత్ముల అభిప్రాయమై యున్నది.

39.  ఏ ఆత్మ సర్వులకును ప్రభువై వున్నదో అది దీనత్వమును, బంధనమును పొందుట, తప్పక యుక్తి విరుద్ధమై యున్నది. కాని వాస్తవముగ ఇదియే భగవంతుని మాయయై యున్నది.

40. జలమునందలి కంపనాదులు ప్రతిబింబిత చంద్రుని యందు తోచునట్లును ఆకాశమందలి చంద్రుని యందు ఉండవు. దేహాభిమానియగు జీవుని యందే దేహధర్మములు తోచునుగాని పరమాత్మ యందు కాదు.

41.    నిష్కామభావముతో ధర్మములను ఆచరింపగా భగవత్కృపచే లభించు భక్తియోగము ద్వారా ఈ ప్రతీతి (అఙ్ఞానము) మెల్ల మెల్లగా తొలగిపోవును.42. ఎపుడు ఇంద్రియములన్నియు విషయములనుండి మఱలి సాక్షియు, పరమాత్మయునగు శ్రీహరి యందు నిశ్చలముగ నెలకొనియుండునో, అపుడు జీవుని రాగద్వేషాది సమస్త క్లేశములు పూర్తిగ నశించిపోవును.

43.  శ్రీకృష్ణుని గుణముల వర్ణనము, శ్రవణము దుఃఖ రాశినంతను శమింపజేయును.

44.  అనాత్మ పదార్థము వాస్తవముగ లేదు, అది కేవలము ప్రతీతమగుచున్నది.

45.  అల్ప పుణ్యము కలవానికి మహనీయుల సేవాభాగ్యము లభించుట చాల కష్టము.

46. గురువులు తమ ప్రియశిష్యులకు, పుత్రులకు అడుగకుండగనే వారికి హితకరములైన వాక్యములను చెప్పుచుందురు.

47. మనుజుడు ఎంతవరకు భగవంతుని యొక్క అభయప్రదములగు పాదకమలములను ఆశ్రయించడో, అంతవఱకు అతనికి ధన, గృహ, బంధువుల వలన కలుగు భయము, శోకము, ఆశ, దీనత్వము, మహాలోభము మున్నగునవి బాధించుచుండును.

48. ఎవరు విద్వాంసులైయున్నను మీ యొక్క కథా ప్రసంగమునకు విముఖులైయుండినచో వారున్ను సంసారమందు తగుల్కొదురు. అనేక మనోరథముల వలన నిద్రాభంగము కలవారై ఉందురు. మఱియు ద్రవ్యసిద్ధి కొఱకై వారి ప్రయత్నములన్నియు కూడ విఫలములై పోవును.

49.  భగవంతుని యొక్క మార్గము గుణముల శ్రవణము చేతనే ఎఱుగ బడుచున్నది.

50. మనుజుల భక్తియోగము ద్వారా పరిశుద్ధమైన హృదయ కమలమందు భగవంతుడు నివసించుచున్నాడు.

51.  ఏ కర్మ భగవంతునికి అర్పణ చేయబడుచుండునో అద్దానికెపుడును నాశనము ఉండదు. అది అక్షయమై పోవును.

52.    ఎవడు అంత్యకాలమున భగవంతుని యొక్క అవతారములను, గుణములను, నామములను వివశుడై ఉచ్చరించునో, అతడు అనేక జన్మలందు చేసిన పాపములనుండి తత్ క్షణమే విడుదల బొంది మాయాది ఆవరణములు లేని బ్రహ్మపదమును పొందుచున్నాడు.

53. దేహాదులున్ను నా కొఱకే ప్రియములుగ తోచుచున్నవి. కాబట్టి నాయందే భక్తి కలిగియుండవలెను.

54.  భగవంతుడగు విష్ణువు యొక్క కథలను వినుట, ధ్యానించుట, రచించుట, నిరూపించుట ద్వారా సాధకుడు త్వరితగతిని భక్తి యోగము పొందవచ్చును.

55.  ఆత్మఙ్ఞానము యొక్క సూక్ష్మమార్గం చాలకాలము నుండి లుప్తమై పోయినది. దానిని తిరిగి ప్రవర్తింపజేయుటకే భగవానుడు ఉద్భవించునది.

56.    పరమాత్మయందు ఆసక్తి కలిగి యున్నచో అదియే మోక్షమునకు కారణమగుచున్నది.

57. వివేకవంతులు సంగము (ఆసక్తి) నే ఆత్మ యొక్క అచ్ఛేద్యమగు బంధనముగా తలంచుచున్నారు. ఆ సంగమే మహాత్ముల యెడల గావించబడినచో మోక్షము యొక్క తెరవబడిన ద్వారమగుచున్నది.

58. భక్తుల లక్షణాలు: సహనశీలురు, దయాళువులు, ప్రాణులందఱికిని అకారణముగనే హితమాచరించు వారును, నా కొఱకై తమ సమస్త కర్మలను, సొంత బంధువులను కూడ వదలి వేయువారును, నా యందు దత్తచిత్తులై, నా యొక్క పవిత్రకథలను వినువారును, కీర్తించువారును, నాయందే మనస్సును లగ్నము చేయువారును అగు భక్తులకు సంసారమందలి వివిధతాపములు ఏవియు కష్టమును కలిగింపజాలవు.

59. సజ్జనుల సాంగత్యమువలన భగవంతుని పరాక్రమమును గూర్చిన యథార్థఙ్ఞానమును తెలుపునట్టియు, హృదయమునకు, చెవులకు ఇంపుగా నుండునట్టియు కథలు వినుట తటస్థించును. వానిని సేవించుటచే మోక్షమార్గమునందు శ్రద్ధ, ప్రేమ, భక్తి క్రమముగ వికసించును.60.    యోగము యొక్క భక్తి ప్రధానములగు సరళ ఉపాయముల ద్వారా సాధకుడు మనోనిగ్రహముకై ప్రయత్నించవలెను.

61. ప్రకృతి యొక్క గుణములచే ఉత్పన్నమైన శబ్దాది విషయములను త్యజించుట వలనను, వైరాగ్యయుక్తమగు ఙ్ఞానము చేతను, యోగము చేతను, భగవంతుని యెడల సుధృడ భక్తిచేతను, మనుజుడు తన అంతరాత్మయగు పరమాత్మను ఈ దేహమందే పొందుచున్నాడు.

62.  ఈ ప్రపంచమంతయు దేనిచే వ్యాపించబడి ప్రకాశించు చున్నదో, అట్టి ఆత్మయే పురుషుడు. (సూర్యుడు) అతడు అనాది, నిర్గుణుడు, ప్రకృతికంటే పరమైనవాడు. హృదయమున స్పురించువాడు. స్వయంప్రకాశుడు.

63.  ఆ పురుషుడు త్రిగుణాత్మకమగు మాయను తన ఇచ్చచే స్వీకరించెను.

64.  ప్రకృతి తన సత్త్వాది గుణముల ద్వారా తనకు అనురూపమగ ప్రజలను సృష్టింపదొడగెను. ఇది చూచి, పురుషుడు ఙ్ఞానమును కప్పివేయు దాని ఆవరణ శక్తిచే మోహితుడై తన స్వరూపమును మఱచిపోయెను.

65.  ఈ ప్రకారముగ తనకంటె వేఱైన ప్రకృతినే తన స్వరూపముగ తలంచుటవలన, పురుషుడు ప్రకృతి యొక్క గుణములచే చేయబడు కర్మలకు తానే కర్త అని భావించుచున్నాడు.

66.  ఇట్టి కర్తృత్వాభిమానము చేతనే అకర్తయు, స్వాధీనుడును, సాక్షియు, ఆనందస్వరూపుడును అగు పురుషునకు జనన మరణరూపబంధనము, పరతంత్రత సంభవించుచున్నది.

67.  ఆ అభిమానము వలన, దేహసంసర్గముచే చేయబడు పుణ్యపాపరూపకర్మల దోషముచే తన శాంతిని పోగొట్టుకొని ఉత్తమ, మధ్యమ, అధమ జన్మలను పొందుచు సంసార చక్రమున తిరగాడు చున్నది. 

68.    కాబట్టి బుద్ధిమంతుడగువాడు విషయసేవనమందు తగుల్కొనిన చిత్తమును తీవ్రభక్తి యోగము ద్వారా మెల్లమెల్లగ తన వశము చేసికొనవలెను. నిష్కామభావముతో చేయబడిన స్వధర్మపాలన ద్వారా హృదయము  శుద్ధపడగా, బహుకాల మాచరించిన భగవత్కథా, శ్రవణముల ద్వారా ఏర్పడిన ధృడమైన దైవభక్తి చేత మనుజుని ప్రకృతి అనగా అవిద్య అహర్నిశములు క్షీణించుచు నెమ్మదిగ నశించిపోవును.

69.  అనుభవించి వదలి వేయబడిన ఆ ప్రకృతి, సదా దాని యందు దోషమును చూచుట వలన, ఇక స్వస్వరూపమున ఉన్నవాడును, బంధముక్తుడును అగు మనుజుని ఏ మాత్రము చెడగొట్టజాలదు.

70. ధైర్యవంతుడగు నా భక్తుడు నా యొక్క అనుగ్రహముచే తత్త్వఙ్ఞానమును బడసి ఆత్మానుభవము ద్వారా సమస్త సంశయముల నుండి విడివడుచున్నాడు.

71. భక్తియోగమందు తత్పరమైనదియు, రాగద్వేషాది వికారములు లేనిదియునగు చిత్తము పరమాత్మను పొందును.

72.  దేహత్మ దృష్టి కలవారును అగు దుష్టుల సాంగత్యమును ఎన్నడును చేయరాదు.

73.  స్త్రీల యొక్కయు, స్త్రీల సాంగత్యము కలవారి యొక్కయు, సాంగత్యము వలన జీవునకు ఎట్టి మోహము, బంధనము కలుగునో, అట్టి బంధనము మఱిదేని యొక్క సాంగత్యము వలనను కలుగనేరదు.

74.    యోగము యొక్క గొప్పపదమందు ఆరూఢుడు కాదలంచిన వారు లేక మత్సేవా ప్రభావముచే, ఆత్మానాత్మ వివేకమును బడసినవాడు స్త్రీల సాంగత్యమును ఎన్నడును చేయరాదు.

75. జీవుడు మరణాదులవలన భయమునుగాని, దీనత్వమును గాని, మోహమును గాని పొందరాదు.76.  అతడు తన యదార్థస్వరూపము నెఱిగి ధైర్యముగ, నిస్సంగభావముతో సంచరించవలెను.

77. యోగ, వైరాగ్యసహితమగు సమ్యక్ ఙ్ఞానముతో గూడిన బుద్ధిచే అనాసక్తముగ వ్యవహరించవలెను.

78. ఎవరు స్వధర్మములను భగవంతుని ప్రసనత్వము కొఱకే వానిని పాలించుదురో, అట్టి అనాసక్తులు సత్వగుణముద్వారా సర్వధా శుద్ధచిత్తులగుచున్నారు.

79. వారు తుదకు సూర్యమార్గము (అర్చి మార్గము) ద్వారా సర్వవ్యాపి అయిన శ్రీహరినే పొందుచున్నారు.

80. భగవంతుడగు వాసుదేవుని యెడల ఒనర్పబడు భక్తియోగము ప్రపంచము యెడల వైరాగ్యమును, బ్రహ్మ సాక్షాత్కారరూపమగు ఙ్ఞానమును శీఘ్రముగ కలుగజేయును.

81.  ఒక్క భగవంతుడే స్వయముగ జీవుడు, శరీరము, విషయములు, ఇంద్రియాదులు మున్నగు అనేక రూపములందు గోచరించుచున్నాడు.

82. యోగుల యొక్క అభీష్టఫలము సమస్త దృశ్య ప్రపంచము యెడల సంగము (ఆసక్తి) లేకుండుటయే యగును.

83.  బ్రహ్మము ఏకమును, ఙ్ఞానస్వరూపమును, నిర్గుణమును అయియున్నది.

84.  ఎవడు శ్రద్ధ, భక్తి, వైరాగ్యము, నిరంతర యోగాభ్యాసము ద్వారా ఏకాగ్ర చిత్తుడును, అసంగబుద్ది గలవాడును అగునో అట్టివాడే ఈ జగత్తును బ్రహ్మరూపముగ వీక్షింపగల్గును.

85. దైవవిధానము ననుసరించి సుఖముగాని, దుఃఖముగాని ఏది లభించునో దాని యందే చిత్తమును సంతుష్టపఱచవలెను.

86. మనుజుడు తనకంటె అధికుడైన గుణవంతుని చూచి సంతోష పడవలయును. తనకంటె తక్కువగుణములు కలవాని యెడల దయ కలిగియుండవలెను. ఇట్లుండుటచే అతనిని దుఃఖమెన్నడును బాధింపకుండును.

87. పరమాత్మ యొక్క మానసపూజ చేయువారి అంతఃకరణమున హృదయకమలమునందు, భగవానుడు తన పాదారవిందములను వుంచి విరాజిల్లుచుండును.

88.  భగవంతుడెవని యెడల ప్రసన్నుడగునో అట్టివానికి జనులందఱును నమస్కరించుదురు.

89.  తనకంటె పెద్దవారి యెడల సహనశీలత్వము, చిన్నవారి యెడల దయ, సమానుల యెడల మిత్రత్వము, సమస్త జీవుల యెడల సమత్వ వర్తనము కలిగియుండుటచేతనే సర్వాత్మయగు శ్రీహరి ప్రసన్నుడగును.

90. హృదయమున వాత్సల్యవశమున విశేషరూపముతో విరాజమానుడై యున్న ఆ నిర్గుణ, అద్వితీయ, నాశరహిత, నిత్యముక్త పరమాత్మను అధ్యాత్మదృష్టితో మీ అంతఃకరణమున వెదుకుడు.

91.  అట్లొనర్చుటచే భగవంతుని యందు మీకు సుధృడమగు భక్తి కలుగును. వారి ప్రభావముచే “నేను” “నాది” అను రూపమున మీకు ధృడపడిన అవిద్యాగ్రంథి ఛేదించి వేయబడగలదు.

92.  క్రోధము శ్రేయోమార్గము యొక్క పరమ విరోధి అయియున్నది.

93.  సంసారపాశము నుండి విడుదల పొందుటకై సర్వజీవులందును సమదృష్టి కలిగి శ్రీహరిని భజింపుడు.

94.  శాస్త్రములు జీవులశ్రేయస్సు కొఱకై చక్కగ విచారించును. దేహాదుల యెడల  వైరాగ్యము కలిగియుండుట, తన ఆత్మ స్వరూపమగు నిర్గుణ బ్రహ్మమందు సుధృడమగు అనురాగము కలిగి యుండుట  అను నివియే జీవుని శ్రేయస్సునకు సాధనములని వానియందు నిశ్చయింపబడినది.

95.  పరబ్రహ్మమందు సుధృడమగు ప్రీతి కలుగగా మనుజుడు సద్గురువును శరణుబొందును.

96.  ఇంద్రియాసక్తమగు మనస్సు బుద్ధి యొక్క విచారణాశక్తిని క్రమముగ హరించి వేయుచున్నది.

97.  ఎపుడు విచారణశక్తి నశించునో, అపుడు పూర్వాపరముల స్మృతి నశించును. ఎపుడు స్మృతి నశించునో అపుడు ఙ్ఞానము ఉండదు.

98.    ఙ్ఞానము యొక్క నాశముచే ఎట్టి హాని కలుగునో, దానిని మించిన హాని ప్రపంచమున జీవునకు మఱియేదియు నుండదు.

99.  ధనము, ఇంద్రియ విషయములు  వీనిని గూర్చిన చింతన మనుజుని పురుషార్ధములన్నింటిని నశింపజేయును.

100. అఙ్ఞానాంధకారమును పోగొట్టుకొనదలంచువాడు విషయము లందాసక్తి ఎన్నడును కలిగియుండరాదు.

101.  ఇష్టము వచ్చినట్లు చేయరాని కర్మలను చేసినచో, మనుజుడు అభిమానమునకు వశుడై కర్మలందు బద్ధుడగును.

102.  చెట్టు యొక్క మొదలుకు నీరుపోయుటచే దాని బోదె, కొమ్మలు, చిలువలు మున్నగునవి యన్నియు ఎట్లు పోషింపబడునో అట్లే భగవంతుని పూజించినచో సమస్తమును పూజించినట్లగును.

103. దేనిచే అంతఃకరణము శుద్ధమగునో అట్టి దివ్యమగు తపస్సునే ఈ శరీరముతో చేయవలెను. దీనిచేతనే అనంతమగు బ్రహ్మానందము సంప్రాప్తించును.

104.  మహాత్ముల యొక్క సేవను మోక్షమునకు ద్వారముగను, కాముకుల సాంగత్యము నరకమునకు ద్వారముగను శాస్త్రములు చెప్పినవి.

105. వాసుదేవుడగు నా యందెంతవఱకాతనికి ప్రీతి కలుగకుండునో, అంతవఱకు అతడు దేహబంధనము నుండి విడివడనేరడు.

106.    శాస్త్ర, సజ్జనుల వచనములందు సత్యత్వబుద్ధి కలిగియుండుట చేత, నిరంతరము జాగరూకుడై యుండుటచేత, అంతటను నా యొక్క సత్తను వీక్షించుటచేత, అహంకారరూపమగు తన లింగశరీరమును (సూక్ష్మ దేహమును) లయింపజేయవలెను. ఆపిదప ఏ సాధనయు లేక పూర్ణ విరామమును పొందవలెను. 107.  నా లోకమును పొందదలచువాడు రాజు అయినచో తన ప్రజలకును, గురువైనచో తన శిష్యులకును, తండ్రి అయినచో తన బిడ్డలకును ఇట్టి శిక్షణనే ఒసంగవలెను.

108.  అఙ్ఞానవశమున దీనిననుసరించక విషయాసక్తి యుక్తమగు కర్మనే పరమ పురుషార్థముగ ఎవరైన భావించుచో వారిని కోపగించక, మెల్లగవారికి నచ్చచెప్పి కర్మమందు ప్రవృత్తులు కాకుండునట్లు చూడవలెను.

109. కామము, క్రోధము, మదము, లోభము, మోహము, భయము మున్నగు శత్రువులకును, కర్మబంధనమునకును మూలము మనస్సే అయియున్నది.

110.  అట్టి మనస్సు పై విశ్వాసముంచినచో, యోగిని భ్రష్ట మొనర్చివేయును. కావున మనస్సును జయించి భగవంతుడగు శ్రీకృష్ణుని యెడల అనన్యభక్తి కలిగియుండవలెను.

111.    విషయరహితమగు మనస్సే అతనికి శాంతిమయమగు మోక్ష పదమును ఒసంగును.

112.  మనస్సును ఉపేక్ష చేసినందువలన అది ఇంకను బలపడును. Prevention is better than cure. అది స్వయముగ సర్వధా మిథ్య అయి యున్నను, మీ యొక్క ఆత్మ స్వరూపమును అది కప్పివేయును.

113. కాబట్టి మీరు జాగరూకులై శ్రీగురువు యొక్కయు, శ్రీహరి యొక్కయు పాదములను ఉపాసించుట యను అస్త్రముచే దానిని వధించి వేయుడు. 

114.  ఎపుడు భగవత్కథలు సదా సేవింపబడుచుండునో, అపుడవి మోక్షకాంక్షి యగు మనుజుని నిర్మల బుద్ధిని భగవంతుడగు వాసుదేవుని యందు సంలగ్నము చేయును.

115. విరక్తులగు మహాత్ముల సత్సాంగత్యముచే ప్రాప్తించు ఙ్ఞానమను ఖడ్గముచే మనుజుడు ఈలోకమందే తన మోహబంధనమును ఛేదించి వేయవలెను.

116.  మనుష్యుడు మనస్సు, వాక్కు, శరీరములచే పాపము చేయుచున్నాడు.

117.  పాపములకు యథార్థమగు ప్రాయశ్ఛిత్తము తత్త్వఙ్ఞానమే అయియున్నది.

118. ఎవడు నియమములను చక్కగ పాలించునో, అతడు మెల్ల, మెల్లగ పాపవాసన నుండి విముక్తుడై శ్రేయోదాయకమగు తత్త్వ ఙ్ఞానమును పొందుటకు సమర్థుడగుచున్నాడు.

119.  ఎవరు ఈ సంసార బంధనము నుండి తప్పించుకొనదలంచుదురో, వారికి భగవంతుని నామమునకు మించిన మఱియొక సాధనమేదియును లేదు.

120.  భగవంతుని ద్వారా నిర్మితమైన భాగవతధర్మము పరమశుద్ధమైనది. రహస్యమైనది. దానిని తెలిసికొనుట కష్టము. దానిని తెలిసికొనినవాడు భగవత్స్వరూపమును పొందును.

121.  ఈ ప్రపంచమున జీవుల యొక్క పరమ కర్తవ్యము, పరమధర్మము నామ సంకీర్తనాది ఉపాయములద్వారా భగవంతుని పాదము లందు భక్తి భావమును బడయుటయే యగును.

122. ఎవరు భగవంతుని యొక్క ఉదారములైన, కృపాపరిపూర్ణములైన చరిత్రలను శ్రవణము, కీర్తనము గావించుదురో, వారి హృదయమందు ప్రేమమయమగు భక్తి జనించును.

123. ఎవరు హృదయము నుండి పొంగివచ్చుచున్న భయంకరమగు క్రోధమును ఆత్మవిచారణ ద్వారా శరీరమందే శమింపచేయుదురో, బయటకు రానీయకుందురో, వారు కాలక్రమమున మూడు గుణములపై (సత్వ, రజో, తమో గుణములపై) విజయమును పొందగలరు.124.  ఈ సృష్టి లేనపుడు కేవలము నేనే నిష్ర్కియా రూపమున ఉంటిని. నేను కేవలము ఙ్ఞానస్వరూపుడను, అవ్యక్తుడను. అపుడు అంతట ప్రశాంతత వ్యాపించి యుండెను.

125.  ఎవరు తమ్ము తాము గొప్ప బుద్ధిమంతులుగ తలచుకొని కర్మ యొక్క జంజాటమున పడియున్నారో, వారికి విపరీతఫలము లభించుచున్నదని యెఱుగవలెను.

126. ఆత్మ యొక్క స్వరూపము మహాసూక్ష్మమనియు, జాగ్రత్, స్వప్న, సుషుప్తులను మూడవస్థలకంటెను వేఱుగనున్నదనియు తెలిసికొనవలెను.

127.  విషయభోగముల నుండి తన మనస్సును వివేక బుద్ధి ద్వారా మఱలించి, ఙ్ఞాన, విఙ్ఞానములందే సంతుష్టిని బడసి నా భక్తుడు కావలెను.

128.  బ్రహ్మ, ఆత్మల ఏకత్వమును అనుభవించుటయే జీవుని గొప్ప స్వార్థము, పరమార్థము అని బాగుగ యెఱుంగవలయును.

129.  సుఖమును గాని, దుఃఖమును గాని ఒసంగునది తన ఆత్మ కాదు.

130.    ఈ ప్రపంచము సత్వ, రజ, స్తమో గుణముల స్వాభావిక ప్రవాహమై యున్నది.

131. మనుజుడు అఙ్ఞానవశమున ఆత్మయందు దేవత, మనుష్యుడు ఇత్యాది భేదమును, గుణదోషాదుల కల్పనను గావించుచున్నాడు.

132. తమ తమ కర్మానుసారము దైవవశమున జీవులు కలిసికొనుచు మరల విడిపోవుచు నుందురు.

133.  శరీరరహితమగు ఆత్మను శరీరమని భావించుటయే అఙ్ఞానము.

134. ఎపుడు ఎవడైనను దేవతలను, వేదములను, గోవులను, బ్రహ్మనిష్ఠులను, సాధువులను, ధర్మమును, నన్ను ద్వేషించునో అపుడాతని వినాశము శీఘ్రముగ సంభవించును.

135.  భగవంతుని ప్రసన్నునిగ జేయుటకు పెద్ద పరిశ్రమ గాని, ప్రయత్నము గాని చేయనవసరము లేదు. ఏలయనిన, వారు సమస్త ప్రాణుల యొక్క ఆత్మ మఱియు సర్వత్ర, సర్వుల యొక్క సత్తారూపమున స్వయం సిద్ధమైనవారు అయివున్నారు.

136.  భగవంతుని విశ్వవ్యాపకము

137.  బ్రహ్మదేవుడు మొదలుకొని తృణము వఱకు గల సమస్త ప్రాణులందును, పంచ భూతములచే చేయబడిన వస్తువులందును, పంచ భూతములందును ( భూమి, గాలి, అగ్ని, వాయువు, ఆకాశము), సూక్ష్మ తన్మాత్రలందును, మహత్తత్వమందును, త్రిగుణములందును, గుణముల సామ్యావస్థయగు ప్రకృతియందును ఒకే పరమాత్మ వెలయుచున్నారు. వారు సౌందర్య, మాధుర్య, ఐశ్వర్యముల యొక్క నిధి అయియున్నారు. వారే అంతర్యామిగను, ద్రష్టగను ఉన్నారు. వారు అనిర్వచనీయులును, వికల్పరహితులును అయిఉన్నారు.  

138.  వారు కేవలము అనుభవస్వరూపులును, ఆనంద స్వరూపులును అగు పరమేశ్వరుడు అయిఉన్నారు.

139.  గుణమయమగు సృష్టి ఒనర్చు మాయ ద్వారా భగవంతుని యొక్క ఐశ్వర్యము తెలియుట లేదు. ఆ మాయ తొలగగనే వారి దర్శనమగు చున్నది.

140.  కాబట్టి మీరు మీ దైత్యస్వభావమును, అసురీ సంపత్తిని వదిలిపెట్టి సమస్త ప్రాణుల యెడల దయ కలిగియుండుడు. ఫ్రేమతో వారికి హితము చేయండి. దీనిచే భగవంతుడు ప్రసన్నుడగును.

141.  నిర్మలఙ్ఞానము భగవంతుని యెడల అనన్య ప్రేమగల భక్తుల యొక్క పాదకమలముల ధూళిచే తన శరీరమునకు స్నానమొనర్చు వారికందఱికిని సంప్రాప్తించగలదు.

142.  భగవంతుడు ప్రసన్నుడైనచో ఇక లభించని వస్తువేది కలదు?

143.  విఙ్ఞాన సహితమగు ఈ నిర్మల ఙ్ఞానము పరిశుద్ధమైన భాగవత ధర్మమై యున్నది.

144.  ఆత్మ తత్వము నిత్యమైనది.  నాశరహితమైనది. శుద్ధమైనది. ఏకమైనది. క్షేత్రఙ్ఞమైనది. ఆశ్రయమైనది. నిర్వికారమైనది. స్వయం ప్రకాశమైనది. సర్వమునకు కారణమైనది. వ్యాపకమైనది. అసంగమైనది. ఆవరణ రహితమైనది.

145.  గుణములు, కర్మలు వీని వలన కలుగు జనన మరణ చక్రము ఆత్మను శరీరము కంటెను, ప్రకృతి కంటెను వేఱు చేయని కారణము వలననే సంభవించుచున్నది.

146.  కనుక మీరు మొట్ట మొదట ఈ గుణముల ననుసరించి కలుగు కర్మల యొక్క బీజమునే నశింపచేయవలెను. దీని వలన బుద్ధి వృత్తుల యొక్క ప్రవాహము తొలగిపోవుచున్నది.

147.  ఏ ఉపాయముచే భగవంతుని యందు స్వాభావికమగు నిష్కామ ప్రేమ, భక్తి కలుగునో ఆ ఉపాయము సర్వ శ్రేష్ఠమైనది.

148.  శ్రీహరి సమస్త ప్రాణులందును విరాజమానులై వున్నారన్న భావనచే యథాశక్తి సమస్త ప్రాణుల యొక్క కోరికలను పూర్ణమొనర్చవలెను మఱియు హృదయపూర్వకముగ వారిని గౌరవించవలెను.

149.    విషయభోగ సంబంధములైన మాటలు వినుటకు మాత్రము ఇంపుగా నుండును.

150.  ఙ్ఞానులు శబ్ధముల మాయ నుండి ఉపరతులగుచున్నారు.

151.  మోక్షప్రాప్తికి పది సాధనలు చాల ప్రసిద్ధమై యున్నవి. అవి మౌనము, బ్రహ్మచర్యము, శాస్త్రశ్రవణము, తపస్సు, స్వాధ్యయనము, స్వధర్మపాలనము, యుక్తుల ద్వారా కావింపబడు శాస్త్రవ్యాఖ్యానము, ఏకాంతసేవనము, జపము, సమాధి అనునవి. 

152.  నవవిధ భక్తి మార్గములు: శ్రవణం, కీర్తనం, స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం ద్వారా శ్రీహరిని ప్రార్ధించవలసినది.

153.  ధర్మ, అర్థ, కామములు అన్నియు భగవంతుని ఆశ్రయించుకొని యున్నవి. వారి ఇచ్చ లేనిచో అవి లభింపజాలపు.

154.  జీవుడు ఆత్మ సాక్షాత్కారము ద్వారా ఈ దేహ, ఇంద్రియాదులను కల్పనామాత్రములుగ నిశ్చయించి స్వతంత్రుడు కానంతవఱకు “నేను పురుషుడను, ఈమె స్త్రీ” అనునిట్టి ద్వైతము నశించదు.

155.  భగవంతుడు సర్వత్ర వ్యాపించియున్నను, ఒకచోట క్రొత్తగా ప్రవేశించుటగాని, అట నుండి తొలగుటగాని లేకున్నను, అగ్నియందు, గురువు నందు, అత్మ యందు, సమస్త ప్రాణికోట్ల యందు వారు విశేష రూపమున విరాజమానులైయున్నారు. కావున వారిపై సదా భక్తిని కలిగివుండవలెను. 

156.  వాద వివాదముల కొఱకై తర్కము చేయరాదు. ప్రపంచమున ఏ పక్షమున్ను వహింపరాదు.

157.  తృష్ణ ఎటువంటిదనగా, ఇచ్ఛానుసారము భోగములు సంప్రాప్తించినను అది తృప్తిపడదు.

158.  సుఖమే ఆత్మ యొక్క స్వరూపము, సమస్త క్రియల యొక్క నివృత్తియే దాని ఆకారము. తన ఆత్మ కంటె వేఱైన వస్తువునందు సుఖము కలదని తలంచు మనుజుడు ఆత్మను వదలి విషయముల వైపుకు పరుగెత్తుచున్నాడు.

159.  దేనిచే పొట్ట నిండునో కేవలము అంతమాత్రపు ఆహారము పైన, ధనము పైన మాత్రమే మనుష్యులకు అధికారము కలదు. దాని కంటె అధికమైన ఆహారమును, సంపత్తిని తనదని భావించినచో అట్టివాడు దొంగయే యగును. మఱియు అతడు దండనకు పాత్రుదగును.

160.  ఎచట సత్పాత్రులు లభించుదురో, అదియే అన్నిటికంటె పవిత్రమైన దేశము.

161.  పుష్కరాది సరోవరములు, సిద్ధ పురుషులచే సేవింపబడు క్షేత్రములు, కురు క్షేత్రము, గయ, ప్రయాగ, పులహాశ్రమము, నైమిశారణ్యము, ఫాల్గుణ క్షేత్రము, సేతు బంధము, ప్రభాసము, ద్వారక, కాశి, మధుర, పంపా సరోవరము, బిందు సరోవరము, బదరికాశ్రమము, అలకనంద సీతారాముల ఆశ్రమములు (అయోద్య, చిత్ర కూటాదులు), భగవంతుని అర్చావతారము లున్న చోట్లు అన్నియు చాల పవిత్రములైనవి. 162.  శ్రేయస్సును కోరువాడు ఈ ప్రదేశములను మరల, మరల సేవించవలెను. ఈ స్థానములందు ఏ యే పుణ్యకర్మలాచరించబడునో, వాటికి వెయ్యి రెట్లు అధికఫలము మనుజులకు లభించగలదు. అలాగే యాత్రాస్థలముల యందు, పుణ్యతిధుల యందును పాపపు కర్మలాచరించకుండా వుండ వలెను.

163.  ఎవరు పరప్రాణిని ద్వేషించుదురో, వారు విగ్రహములను పూజించినను, ఉపాసించినను, వారికి సిద్ధి లభించజాలదు.

164.    సద్ధర్మ పరిపాలనను అభిలషించువారు ఏ ప్రాణికిని మనస్సు, వాక్కు, శరీరములద్వారా ఏ ప్రకారమైన కష్టమును కలిగించరాదు. దీనిని మించిన ధర్మమేదియును లేదు.

165.  ఎవని మనస్సు నందు సంతుష్టి కలదో, అతనికి సదా ఎల్లెడల సుఖమే కలుగును. దుఃఖము కలుగనే కలుగదు.

166.  గొప్ప గొప్ప విద్వాంసులు కూడ అసంతుష్టి వలన పతనమై పోవు చున్నారు.

167.  సంతుష్టి లేనివానికి ఇంద్రియలోలత్వము వలన తేజస్సు, విద్య, తపస్సు, కీర్తి క్షీణించిపోవును. అతడు వివేకమును పోగొట్టుకొనును.

168.  సంకల్పమును వదలుట ద్వారా కామమును, కోరికలను వదలుట ద్వారా క్రోధమును, ధనమును అనర్ధముగ దలంచుట ద్వారా లోభమును, తత్త్వవిచారణద్వారా భయమును జయించవలెను.

169.  అధ్యాత్మ విద్య ద్వారా శోకమును, మోహమును, మహాత్ములను ఉపాసించుట ద్వారా దంభమును, మౌనము ద్వారా యోగము యొక్క విఘ్నములను, శరీరాదులను చేష్టా రహితముగ నొనర్చుట ద్వారా హింసను జయించవలెను.

170.  దయ ద్వారా ఆధి భౌతిక దుఃఖమును, సమాధి ద్వారా ఆధి దైవిక దుఃఖమును, యోగబలము ద్వారా అధ్యాత్మిక దుఃఖమును, సాత్త్విక భోజనము మున్నగు వాని ద్వారా నిద్రను జయించవలెను.

171.  సత్త్వగుణము ద్వారా రజో గుణ, తమో గుణములను, ఉపరతి ద్వారా సత్త్వ గుణమును జయించవలెను.

172.  గురుభక్తి ద్వారా ఈ సమస్త దోషములును సులభముగ జయించ వచ్చును.

173. హృదయమందు ఙ్ఞాన దీపమును వెలిగించు గురు దేవుడు సాక్షాత్ భగవంతుడే అయియున్నారు.

174.    ఏ దుర్బుద్ధి వారిని మనుష్యుడుగ తలంచునో, అతని శాస్త్ర శ్రవణ మంతయు గజ స్నానము వలె వ్యర్ధమే యగును.

175.  గొప్ప యోగీశ్వరులు ఎవరి పాదకమలములను ధ్యానించుచున్నారో, ప్రకృతి పురుషుల అధీశ్వరుడైన అట్టి భగవానుడే స్వయముగ గురుదేవుని రూపమున వ్యక్తమైయున్నారు.

176.    దేవమాయచే మోహితులైన మూఢుల యెడల కనికరము కలిగి వారిని ఉపేక్షింపవలెను. ఉదాI II కు, కర్మలను త్యజించు గృహస్థుడు, వ్రతములను త్యజించు బ్రహ్మచారి, గ్రామమందు నివసించు వానప్రస్థుడు, ఇంద్రియలోలుడగు సన్న్యాసి మొదలగు వారిని.

177.   నివృత్తి పరాయణుడగు ఙ్ఞాని క్రమముగ అగ్ని, సూర్యుడు, పగలు, సాయంకాలం, శుక్ల పక్షము, పౌర్ణమి, ఉత్తరాయణము వీని అభిమానులగు దేవతల యొద్దకు వెళ్ళి బ్రహ్మలోకమును చేరును.

178.  మహనీయుల సేవ చేతనే భగవంతుడు ప్రసన్నుడగును.

179. ఏ విచారణశీలురు స్వానుభూతిచే అత్మయొక్క మూడు విధములైన అద్వైతములను సాక్షాత్కరించుకొందురో, వారు జాగ్రత్, స్వప్న, సుషుప్తులు, ద్రష్ట, దర్శన, దృశ్యములు అను భేదముతో గూడిన సంసార స్వప్నమును తొలగించు కొనుచున్నారు.

180.  సమస్తము ఒక స్వరూపము అను విచారణ “భావాద్వైతం”, సమస్త కర్మలను పరమాత్మకు సమర్పించుట “క్రియాద్వైతం”, మరియు సమస్త పదార్థములు ఒకే పరమాత్మ స్వరూపము అను విచారణ “ద్రవ్యాద్వైతం” అనబడును.

181.  భగవద్భక్తుడగు మనుజుడు వేదములందు చెప్పబడిన ఇట్టి కర్మల యొక్కయు తదితర స్వకీయ కర్మల యొక్కయు అనుష్ఠానముచే గృహమందున్నను కూడ భగవద్గతిని పొందుచున్నాడు.

182.  ధర్మము యొక్క ఆచరణచే గృహస్థుడు కూడ సన్యాసులకు లభించు ఉత్తమపదమును శీఘ్రముగ పొందుచున్నాడు.

183.  సజ్జనులగు వారు క్షణ భంగురములగు తమ ప్రాణములను కూడ బలి యొసంగి ఇతర ప్రాణులను రక్షించుదురు.

184.  ప్రాణికోట్ల యెడల ఎవరు దయ కలిగి యుందురో, అట్టివారి యెడల భగవంతుడగు శ్రీహరి ప్రసన్నుడగును.

185.  మనుజుడు తన ప్రాణము, ధనము, కర్మ, మనస్సు, వాక్కు మున్నగు వాటి ద్వారా భగవంతుని కొఱకు ఏది చేయబడుచున్నదో, అది యంతయు భేద భావరహితమై యుండుటవలన తన శరీరమునకు, పుత్రాదులకు, ప్రపంచమునకంతటికిని సఫలమగుచున్నది. చెట్టు మొదలుకు నీరు పోయుటచే దాని కొమ్మలు, ఆకులు, అన్నియు తడువబడులట్లు, భగవంతుని కొఱకు కర్మ చేయుటచే, ఆ కర్మలు అందఱి కొఱకు అగుచున్నవి.

186.  భగవంతుని స్మృతి విపత్తులన్నింటి నుండి జీవుని విముక్తము చేయుచున్నది.

187.  అసత్యమాడరాదు,పాపులతో మాట్లాడరాదు, పాపమును గుఱించి మాట్లాడరాదు. చిన్నవి, పెద్దవి అగు సమస్త భోగములను వదిలి వేయవలెను. ఏ ప్రాణికి ఏ విధమైన కష్టమును కలుగజేయరాదు. భగవంతుని ఆరాధన యందేనిమగ్నులై యుండవలెను. ఇదియే భగవంతుని శ్రేష్థమైన ఆరాధన అయియున్నది.

188.  స్వయంప్రాప్తమగు వస్తువుచే సంతుష్టిని పొందువాని తేజస్సు అభివృద్ధిని పొందును.

189.  శరీరధారులగు జీవులు జాగ్రత్, స్వప్నావస్థల యందు కేవలము గుణమయ పదార్థములను, విషయములను సుషుప్తి యందు కేవలం అఙ్ఞానమును చూచుచున్నారు. దీనికి కారణం వారు మీ యొక్క మాయచే మోహితులై యున్నారు. వారు బహిర్ముఖులై యుండుటవలన బాహ్యవస్తువులనే కాంచుచున్నారు.

190.  సంస్కారములచేతనే శుద్ధి కలుగును. ఎట్లనిన కాలముచే జలాదులు, స్నానముచే శరీరాదులు, ప్రక్షాళనముచే వస్త్రాదులు, సంస్కారములచే గర్భాదులు, తవస్సుచే ఇంద్రియాదులు, యఙ్ఞముచే జనుల చిత్తము, దానముచే ధన ధాన్యాదులు, తృప్తిచే మనస్సు శుద్ధపడుచున్నవి.

191.  జీవిత సాఫల్యము ఎంత వఱకు సాధ్యమో అంతవఱకు తన ధనము చేతను, వివేక విచారణ చేతను, వాక్కు చేతను, ప్రాణముల చేతను కూడ ఇతరులకు మేలు కలుగు నట్టి కర్మలను చేయుట యందే కలదు.

192.  ప్రపంచమున ఎవరు “ఈ జగత్తు ఏమి? దీని యందేమి జరుగుచున్నది?”  ఈ మొదలగు విషయములను విచారించుటయందు నిపుణులై యుందురో, అట్టివారు తమ చిత్తమందలి అశుభ వాసనలను, స్వయముగ వివేకశక్తిచే తొలగించుకొందురు.

193.  సమస్త ప్రాణుల యొక్క ముఖ్యముగ మనుష్యుని యొక్క ఆత్మయే హితమును బోధించు గురువైయున్నది.

194.  శ్రీకృష్ణుని పాదపద్మముల యొక్క నిశ్చలమగు స్మృతి సమస్త పాపములను, తాపములను, అమంగళములను నశింపజేసి, పరమశాంతిని విస్తరింపజేయును. దాని ద్వారానే అంతఃకరణము శుద్ధమగును. మఱియు భగవంతుని యెడల భక్తి కలుగును. ఈ ప్రకారముగ పరమ వైరాగ్యయుక్తమగు భగవత్స్వరూపఙ్ఞానము, అనుభవము జీవునకు సంప్రాప్తించును. 195.  భాగవత పురాణమును అధ్యయనము చేయుట వలన బ్రాహ్మణుడు ఋతంభరా ప్రఙ్ఞను (తత్త్వఙ్ఞానమును పొందింపజేయు బుద్ధిని) పొందును.

భాగవత మహాత్య్మము1.   మనుష్యునకు జన్మ జన్మాంతర పుణ్యము ఉదయించు నపుడు ఈ భాగవత శాస్రమతనికి లభించును.

2.   అనేక శాస్త్రములు, పురాణములు వినుట వలన ఏమి లాభము? ముక్తి నొసంగుటకై ఏక మాత్రమగు భాగవత శాస్త్రము గర్జించుచున్నది.

3.   ఏ ఇంటి యందు నిత్యము భాగవత కథ జరుగుచుండునో, ఆ యిల్లు తీర్థస్థానమై పోవును. మఱియు వాని యందు నివసించు వారి పాపము లన్నియు నశించును.

4.   భాగవత కథను చదువనివారు, విననివారు నీటి బుడగల వలె, దోమల వలె కేవలము చచ్చుట కొఱకే పుట్టుచున్నారు.

5.   గురు వాక్యములందు విశ్వాసము, వినయము, మనస్సు నందలి దోషములను జయించుట, దైవకథలయందు చిత్తైకాగ్రత మొదలగు నియములను పాలించుచో శ్రవణము యొక్క యథార్థ ఫలము లభించును. మనుజులు భాగవత కథను విన్దురో నిశ్చయముగ వారందఱును తుదకు భగవన్నిలయమైన వైకుంఠము నందు నివసించుదురు.

6.   ఎవరు దారిద్ర్యమను దుఃఖ జ్వరము యొక్క జ్వాలచే దగ్ధమగు చున్నారో, ఎవరిని మాయా పిశాచి మర్ధించి వేసినదో, ఎవరు సంసార సముద్రమునందు మునిగిపోవుచున్నారో, అట్టివారికి క్షేమము కలుగజేయుట కొఱకు భాగవతము సింహనాదమొనర్చు చున్నది. కావున ఈ కలికాలమందు దీనిని ప్రయత్న పూర్వకముగ సేవించవలయును.

Works at Railways, GUNTUR.
 

“VESAVI VENNELA” – A SHORT TERM SUMMERCAMP.

 

తుది ఘట్టం లో అతి రాత్రం !

 

New set of traditional music Instruments to Lord Balaji

 The temple adminisration of Tirumala Tirupati Devasthanams (TTD) has prepared a new set of musical instruments to present the Traditional Mangalavaidyam before Lord during every ritual. Handing over these new set of instruments to the instrumental artistes of TTD in Tirumala temple on Tuesday, Tirumala JEO Sri KS Srinivasa Raju said these instruments were prepared at a cost of Rs.4lakhs replacing the old ones which are over 32years old. “As per the Hindu tradition, for any ritual or festival Mangala Vaidyams are mandatory as they are considered to be a good sign to carryout any ritual successfully without any interruption. Especially in South Indian temples, the traditional instruments play a vital role during any festival. In Tirumala every day is a festival day and these instruments will be of great use. We have specially designed andcarved out these instruments from a type of wood called “Elpana Karra” which is available only in Srilanka and Singapore”, he added. Meanwhile the new set of traditional instruments included Sannayi, Dolu, Nadaswaram, Swanalu, Gaurugolu, Tirubanalu etc. The instrumental artistes thanked Tirumala JEO for the new set of instruments.

 

Sri Ramanuja Jayanthi celebrations in London

Sri Ramanuja Jayanthi celebrations went very well on Saturday in London. Many people who attended are saying what an informative and well-organised event it was and how much they gained from the speeches and presentations. JET started the program by reading out HH Chinna Jeeyar Swamiji’s message to the audience, followed by the goodwill message from the Mayor of London.Opening the house was done by the Deputy Director of Nehru Centre representing Indian High Commission.

All the speakers excelled in their high quality deliveries. Dr Nanda spoke on Environment, Peace and Vedic Culture, Mukundanji spoke on Sri Ramanujacharya Vaibhavam, Kishanji, Head of the Religious Studies here spoke on the Young perspective of Hinduism and gave guidelines how parents should involve in inculcating good values in children especially in the backdrop of western life-styles and influences.

Madhavaji represented Council of Dharmic Faiths, and gave a community message. Sri CBji was the Chief Guest and introduced the speakers. Pankhaniaji represented Living Planet Foundation and gave a moving introduction to Green Yatra and other objectives. JET gave a power-point presentation on their activities world-wide, including the health camps in Nepal and disaster relief programs for tsunamis and earth quakes in Japan and India. His Excellency Ambassador from the Embassy of Nepal, London came down with his team and was very happy to note JET activities in Nepal- the team later extended any help pertaining to further activities in their country. Our Seva activities, Netra Vidyalaya, Gurukulams and Health and welfare for the under-privileged were shown briefly in JET presentation. JET Prajna kids stole the show with their lovely recitation of Slokas intermittently explaining their significance and meaning. They also made a presentation ” Pride of India” in which they walked dressed up like Lord Rama, Devi Sita and Ramabantu Hanuman, Meera Bai, Kavi Kalidasa, Sakuntala etc.

The famous mythological as well as national characters that made India special in her heritage. One part of the cultural program showcased Krishna’s pranks and divine mischief and Gopika’s kolatam on the song Hey Murali Sridhara, and there was a short playlet- the theme was the importance of parents. Just 6-8 year olds enacted the story of Vinayaka going around his parents thrice while Kartikeya goes swiftly on his peacock vaahan around the world, yet loses to his brother.

Our Prajnites have dressed up amazingly as Ganesh, Kumara Swami, Shiva, Parvati and Narada. We concluded it with the recitation of Matru devo bhava in the background. There was also a small jaanapada nrutyam on Annamacharya’s Tandanaana ahi composition. Councelor Jose Alexander from Newham Constituency had given away certificates to all the participants. Program ended shortly before 9pm, there was a light meal offered to the attendees. It was entirely broadcast live on Telugu Vani radio The success of the event is attributed to the support, hard-work and dedication of many, including parents, volunteers, and sponsors. Thanks to all individuals and distinguished personalities & representatives of secular and faith organisations. We are glad, the message and information has gone to various quarters. Dr Kusum Vyas from Living Planet Foundation USA and I from JET-UK thank you all for your interest and commitment in preserving our culture and the environment.

 

వైభవంగా భద్రకాళీ, భద్రేశ్వరుల కళ్యాణమహోత్సవం

* అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు

ఓరుగల్లు భద్రకాళి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీభద్రకాళీ, భద్రేశ్వరుల కళ్యాణమహోత్సవం కన్నులపండువగా సాగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.

విద్యుద్దీప కాంతుల మధ్య భద్రకాళి ఆలయం బ్రహ్మోత్సవ శోభతో కళకళలాడింది. ఈ కళ్యాణ మహోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం పూర్వ జన్మ సుకృతమని ఆలయ అర్చకులు తెలిపారు.

 
 
About PravasaRajyam

ఎక్కడో పుట్టి… ఎక్కడో పెరిగి… ఎక్కడో వున్నాము…వి్వ వ్యాప్తంగా విస్తరించి వున్న మన తెలుగు ప్రజలందరం ఒక్క చోట చేరాలన్న ఆకాంక్షతో చేస్తున్న నా ఈ చిరు ప్రయత్నమే “ప్రవాసరాజ్యం”( www.pravasarajyam.com )

NRI Network

For info please go through NRI

For NRI Gallery Click NRI Events

Get in touch

UAE Phone: +971 509 772055
Email: uae@pravasarajyam.com

USA Phone: 912-246-6649
Email: usa@pravasarajyam.com

India Phone: +91-40-64592288
Email: ind@pravasarajyam.com

www.pravasarajyam.com